మీ వెంటే మేమంతా.. ఇస్రో శాస్త్రవేత్తలపై ట్వీట్ల వర్షం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ఇస్రో చివరి దశలో అంతరాయం ఏర్పడింది. చంద్రుడికి 2.1కి.మీల దూరంలో ఉండగా.. విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో కొన్ని సంవత్సరాలుగా భారతదేశం కన్న కల చెదిరింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు యావత్ భారతదేశం నిరాశకు గురైంది. అయితే ఈ ప్రయోగం 5శాతం మాత్రమే విఫలమైందని.. 95శాతం విజయవంతమైందని ఇస్రో శాస్ర్తవేత్త తెలిపారు. ఇదిలా ఉంటే ఇస్రో శాస్త్రవేత్తలకు ధైర్యాన్ని చెబుతూ సోషల్ […]

మీ వెంటే మేమంతా.. ఇస్రో శాస్త్రవేత్తలపై ట్వీట్ల వర్షం

Updated on: Sep 07, 2019 | 12:23 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ఇస్రో చివరి దశలో అంతరాయం ఏర్పడింది. చంద్రుడికి 2.1కి.మీల దూరంలో ఉండగా.. విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో కొన్ని సంవత్సరాలుగా భారతదేశం కన్న కల చెదిరింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు యావత్ భారతదేశం నిరాశకు గురైంది. అయితే ఈ ప్రయోగం 5శాతం మాత్రమే విఫలమైందని.. 95శాతం విజయవంతమైందని ఇస్రో శాస్ర్తవేత్త తెలిపారు. ఇదిలా ఉంటే ఇస్రో శాస్త్రవేత్తలకు ధైర్యాన్ని చెబుతూ సోషల్ మీడియాలో ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. ‘‘మీరు ఇప్పటికే మమ్మల్ని గర్వపడేలా చేశారు. మేమంతా ఎప్పుడు మీ వెంటే ఉంటామని’’ వారు కామెంట్లు పెడుతున్నారు.

https://twitter.com/MajorPoonia/status/1170185960056741889

Loading...
Unable to load recommendations.
Follow Us