
బెంగళూరు, సెప్టెంబర్ 21: మెదడున తినే అమీబా వ్యాధి కేరళలో వేగంగా వ్యాపిస్తోంది. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా ఇప్పటికే 19 మంది మరణించారు. మరణాల సంఖ్య అక్కడ వేగంగా పెరుగుతుందటంతో ఆందోళన నెలకొంది. కేరళ రాష్ట్రంలో అమీబా ఇన్ఫెక్షన్ కేసులు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రం ఇరుగుపొరుగు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. హై అలర్ట్ జారీ చేశాయి. ఈ ఇన్ఫెక్షన్ ఎలా వ్యాపిస్తుందో, దాని లక్షణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
కేరళలో మెదడును తినే అమీబా విజృంభిస్తోంది. ఈ ఇన్ఫెక్షన్ నేగ్లేరియా ఫౌలేరి అనే అమీబా ద్వారా వ్యాపిస్తుంది. ఇప్పటివరకు ఈ ఇన్ఫెక్షన్ కారణంగా కేరళలో 19 మంది మరణించారు. 67 మందికి ఈ వ్యాధి సోకింది. ఈ అమీబా సాధారణంగా నిల్వ నీరు, చెరువులు, సరస్సులలో పెరుగుతుంది. అలాంటి నీటిలో ఈత కొడ్డం ద్వారా ఈ అమీబా ముక్కు ద్వారా మెదడులోకి నేరుగా ప్రవేశించి కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ రేటు పెరిగి మరణం కూడా సంభవించవచ్చు.
తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు వంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత 1 నుంచి 9 రోజుల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.