ఒడిశాలో ఓ టీవీ ఛానల్ పై బీజేడీ మహిళా ఎంపీ ఫిర్యాదు

ఒడిశాలో బిజూ జనతా దళ్ (బీజేడీ) కి చెందిన చంద్రాణి ముర్ము అనే మహిళా ఎంపీ ఓ టీవీ ఛానల్ పై ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. ఆ ఛానల్ తన వీడియోలను మార్ఫ్ చేస్తూ,అసభ్యంగా చూపుతూ సర్క్యులేట్ చేస్తోందని ఆమె ఆరోపించింది. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆమె లేఖ రాసింది. సదరు ఛానెల్ పై  కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. కియోంజహార్ లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈమె.. […]

ఒడిశాలో ఓ టీవీ ఛానల్ పై బీజేడీ  మహిళా ఎంపీ ఫిర్యాదు

Edited By:

Updated on: Oct 19, 2020 | 6:09 PM

ఒడిశాలో బిజూ జనతా దళ్ (బీజేడీ) కి చెందిన చంద్రాణి ముర్ము అనే మహిళా ఎంపీ ఓ టీవీ ఛానల్ పై ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. ఆ ఛానల్ తన వీడియోలను మార్ఫ్ చేస్తూ,అసభ్యంగా చూపుతూ సర్క్యులేట్ చేస్తోందని ఆమె ఆరోపించింది. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆమె లేఖ రాసింది. సదరు ఛానెల్ పై  కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. కియోంజహార్ లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈమె.. ఈ ఛానల్ తన ప్రతిష్టను దెబ్బ తీస్తోందని, ఈ నెల 15 నుంచి పలు ఫేక్ కార్యక్రమాలను ప్రసారం చేస్తోందని కూడా దుయ్యబట్టింది. ఈమె ఆరోపణల నేపథ్యంలో రమేష్ రథ్ అనే రిపోర్టర్ ను పోలీసులు అరెస్టు చేసారు.

ఈ ఛానల్ ని బిజూ జనతాదళ్ మాజీ వ్యవస్థాపక సభ్యుడు వైజయంత్ జే  పాండా గతంలో నిర్వహించగా ప్రస్తుతం ఆయన భార్య దీని అజమాయిషీ చూస్తున్నారు.  అయితే ఇప్పుడు వైజయంత్ జే పాండా బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవిలో ఉన్నారు.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us