
#WATCH | Keralam CM Pinarayi Vijayan casts his vote in Assembly elections, at Pinarayi RC Amala Basic Upper Primary School in Kannur pic.twitter.com/yIVgSmzdPh
— ANI (@ANI) April 9, 2026
#WATCH | Puducherry Elections 2026 | A robot, Nila welcomes voters arriving at VOC Govt School to exercise their franchise. https://t.co/0nisPCPdhr pic.twitter.com/HMZoKuQJnf
— ANI (@ANI) April 9, 2026
కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గత కొన్ని వారాలుగా సాగిన ప్రచారపర్వానికి ఇప్పటికే ఎండ్ కార్డ్ పడగా.. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈసారి కేరళ ఎన్నికల బరిలో ప్రధానంగా మూడు కూటములు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. సీఎం పినరయి విజయన్ నాయకత్వంలో వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకుని రికార్డు సృష్టించాలని ఎల్డీఎఫ్ చూస్తోంది. సుపరిపాలన – సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష అని ఎల్డిఎఫ్ నమ్ముతోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ ఈసారి ఎలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఇందిరా గ్యారెంటీలు వంటి వాగ్దానాలతో ఓటర్లను ఆకర్షిస్తోంది. ఎన్డీఏ, ఈసారి కేరళలో బలమైన ముద్ర వేయాలని చూస్తోంది. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగడమే లక్ష్యంగా ప్రచారం నిర్వహించింది. అస్సాంలో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించింది.
కేరళలో పెన్షన్ల పెంపు, ఉచిత వైద్యం వంటి అంశాలు ఓటర్ల మనసు గెలుచుకోవడంలో కీలకం కానున్నాయి. పెరుగుతున్న నిరుద్యోగం, యువత వలసల అంశం ఈసారి ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. మెట్రో విస్తరణ, విజింజం పోర్ట్ అభివృద్ధి వంటి ప్రాజెక్టులపై పార్టీల మధ్య హామీల యుద్ధం సాగింది. కాగా 2021 ఎన్నికల్లో 74.06 శాతం పోలింగ్ నమోదవ్వగా, ఈసారి ఆ శాతం పెరుగుతుందో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది. పోలింగ్ శాతంలో వచ్చే స్వల్ప మార్పులు కూడా ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ముందస్తు సర్వేలు ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యాన్ని ఇవ్వకపోవడంతో, సామాన్య ఓటరు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.