హత్రాస్ ఘటనపై రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మండిపాటు

హత్రాస్ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. దారుణ హత్యాచారానికి గురైన యువతి మృతదేహాన్ని రాత్రి 2 గంటల ప్రాంతంలో పోలీసులు దహనం చేస్తారా ? ఇదెంత దారుణం ?

హత్రాస్ ఘటనపై రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మండిపాటు

Edited By:

Updated on: Oct 05, 2020 | 12:51 PM

హత్రాస్ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. దారుణ హత్యాచారానికి గురైన యువతి మృతదేహాన్ని రాత్రి 2 గంటల ప్రాంతంలో పోలీసులు దహనం చేస్తారా ? ఇదెంత దారుణం ? మొత్తం దేశ జ్ఞాపకాల్లో ఇదో విషాద ఘటనగా మిగిలిపోతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ పాలనలో ఇదంతా జరిగితే ఇక హిందూ సంస్కృతి గురించి ఆ పార్టీ మాట్లాడుతోందని ఆయన సెటైర్ వేశారు. బాధిత యువతి తల్లి విలపిస్తుండగా..తన కూతురిని  కడసారైనా చూసుకోకుండాఅనుమతించని పోలీసులు ఆ యువతి డెడ్ బాడీని   దహనం చేస్తారా అని గెహ్లాట్ అన్నారు. అయితే రాజస్థాన్ లో మాత్రం శాంతి భద్రతల పరిస్థితి మెరుగ్గా ఉందా అని రాష్ట్ర బీజేపీ నేతలు ఆయనను సవాల్ చేశారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us