‘మీరు రైతుల ఆదాయం రెట్టింపు చేయలేదు ఆవేదన చేశారు’: లోకేష్ ట్వీట్

సీఎం జగన్‌ ప్రభుత్వంపై మరోమారు ట్వీట్ చేసిన మాజీ మంత్రి నారా లోకేష్. ఎన్నికల హయంలో జగన్ ఇచ్చిన హామీలపై ట్విట్టర్‌లో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నేరుగా జగన్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ‘అప్పు తీర్చలేదని గోదాంలో ఉన్న శనగ నిల్వలని బ్యాంకులు వేలం వేస్తుంటే.. మీరు నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు. లేట్ ఎందుకూ ఒక ఫోన్ కొట్టండి. బుగ్గనగారు గాలి పోగేసి వేలానికి చంద్రబాబుగారే కారణం అంటూ ఒక లేఖ తయారు చేస్తారు’. ‘రైతుల […]

'మీరు రైతుల ఆదాయం రెట్టింపు చేయలేదు ఆవేదన చేశారు': లోకేష్ ట్వీట్
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2019 | 7:35 PM

సీఎం జగన్‌ ప్రభుత్వంపై మరోమారు ట్వీట్ చేసిన మాజీ మంత్రి నారా లోకేష్. ఎన్నికల హయంలో జగన్ ఇచ్చిన హామీలపై ట్విట్టర్‌లో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నేరుగా జగన్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

‘అప్పు తీర్చలేదని గోదాంలో ఉన్న శనగ నిల్వలని బ్యాంకులు వేలం వేస్తుంటే.. మీరు నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు. లేట్ ఎందుకూ ఒక ఫోన్ కొట్టండి. బుగ్గనగారు గాలి పోగేసి వేలానికి చంద్రబాబుగారే కారణం అంటూ ఒక లేఖ తయారు చేస్తారు’.

‘రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అంటే రైతుల పంటని బ్యాంకులు వేలం వెయ్యడం అని ఆలస్యంగా అర్ధమయ్యింది. @ysjagan గారూ. మీరు రెట్టింపు చేసింది రైతుల ఆదాయం కాదు ఆవేదన. పంటని తక్కువ ధరకు అమ్మాల్సి వస్తే ప్రభుత్వమే కొంటుంది అని మీరు సెలవిచ్చారు’. అంటూ ట్వీట్ చేశారు.