ఆ జిల్లాలో ప్రఖ్యాత ఫోర్డ్​ కంపెనీ జంక్షన్​కు సుశాంత్​ పేరు…

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మ‌రణాన్ని ఇంకా జీర్ణించుకోలేక‌పోతున్నారు ఆయ‌న అభిమానులు. ఇప్ప‌టికీ సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణాలు తెలియ‌రాలేదు.

ఆ జిల్లాలో ప్రఖ్యాత ఫోర్డ్​ కంపెనీ జంక్షన్​కు సుశాంత్​ పేరు...
Follow us

|

Updated on: Jul 10, 2020 | 7:00 PM

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మ‌రణాన్ని ఇంకా జీర్ణించుకోలేక‌పోతున్నారు ఆయ‌న అభిమానులు. ఇప్ప‌టికీ సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణాలు తెలియ‌రాలేదు. కాగా న‌టుడి స్వస్థలం పూర్ణియా జిల్లా వాసులు..అత‌డికి ఘ‌న‌ నివాళి అర్పించారు. సిటీలోని చారిత్రాత్మక ఫోర్డ్​ కంపెనీ జంక్షన్​కు సుశాంత్​ పేరు పెట్టారు. దీనితోపాటే మధుబని నుంచి మాతా ఏరియాని అనుసంధానం చేసే దారిని ఇకపై సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మార్గం అని పిలవనున్నారు. ఈ మేరకు జిల్లా మేయర్​ సవితా దేవి వివ‌రాలు తెలియజేశారు.

మున్సిపల్​ కార్పోరేషన్​లో… వాయిస్​ ఓటింగ్​ పద్దతి ద్వారా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు మేయర్​ తెలిపారు. అంతే కాకుండా, సుశాంత్​ పూర్వీకుల గ్రామం పూర్ణియా అని.. హీరో చ‌నిపోయిన అనంత‌రం తర్వాత అతడి కోసం ఓ స్థూపాన్ని కూడా ఏర్పాటు చేయాల‌ని ప్రజలు డిమాండ్​ చేసినట్లు సవితా దేవి వెల్ల‌డించారు. సుశాంత్​ బాల్య మిత్రుడు, బిహార్​ వికాస్​ మోర్చా అధ్యక్షుడు రాకేశ్​ సింగ్ మట్లాడుతూ.. “ఇది సుశాంత్​కు ట్రిబ్యూట్ మాత్రమే కాదని, రాష్ట్రానికే గర్వకారణం” అని పేర్కొన్నారు.