శివారులో మరో దారుణం… మాయ మాటలు చెప్పి మైనర్ బాలికపై..

నిర్భయ చట్టం ఉన్నా.. దిశ చట్టం వచ్చినా.. కామాంధుల్లో మాత్రం ఏలాంటి మార్పు రావడం లేదు. పోలీసులు హెచ్చరించినా.. కోర్టులు కఠిన శిక్షలు విధించినా.. బాలికలపై, మహిళలపై అత్యాచారాలు జరగడం మాత్రం ఆగడంలేదు. తాజాగా హైదరాబాద్‌ నగర శివారులో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. మాయ మాటలు చెప్పి.. బాలికను వెంట తీసుకెళ్లి.. ఆపై మృగంలా రెచ్చిపోయి.. అత్యాచారానికి ఒడిగట్టాడు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న సదరు బాలిక పరిస్థితిని […]

శివారులో మరో దారుణం... మాయ మాటలు చెప్పి మైనర్ బాలికపై..
Follow us

| Edited By:

Updated on: Jan 19, 2020 | 11:16 AM

నిర్భయ చట్టం ఉన్నా.. దిశ చట్టం వచ్చినా.. కామాంధుల్లో మాత్రం ఏలాంటి మార్పు రావడం లేదు. పోలీసులు హెచ్చరించినా.. కోర్టులు కఠిన శిక్షలు విధించినా.. బాలికలపై, మహిళలపై అత్యాచారాలు జరగడం మాత్రం ఆగడంలేదు. తాజాగా హైదరాబాద్‌ నగర శివారులో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. మాయ మాటలు చెప్పి.. బాలికను వెంట తీసుకెళ్లి.. ఆపై మృగంలా రెచ్చిపోయి.. అత్యాచారానికి ఒడిగట్టాడు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న సదరు బాలిక పరిస్థితిని గమనించిన బంధువులు.. విషయం అడిగి తెలుసుకున్నారు. విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు.. నిందితున్ని పట్టుకుని దేహాశుద్ది చేశారు. అనంతరం స్థానిక పోలీసులకు అప్పగించారు.

కాగా, నిందితుడ్ని వికారాబాద్‌ జిల్లా పరిగి బిసి కాలనీకి చెందిన సాయిగా గుర్తించారు. స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినిని నమ్మించి.. రాత్రి వేళ ఊరి చివరకు తీసుకువెళ్లి.. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.