
బిర్యానీ.. ఇది కేవలం ఒక వంటకం కాదు, హైదరాబాదీల ప్రేమ, సంస్కృతి. తరతరాలుగా వస్తున్న సంప్రదాయ దమ్ బిర్యానీకి నగరవాసులు ఎప్పటికీ అభిమానులే. అయితే, ఇప్పుడు హైదరాబాద్లోని ఆహార ప్రియులు కొత్త రుచుల కోసం వెతుకుతున్నారు. దీంతో నగరంలోని వంటశాలలు వినూత్నంగా, విభిన్నంగా బిర్యానీని వండి, కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టాయి. మీరు నిజంగా బిర్యానీ ప్రియులమని భావిస్తే, ఈ ఐదు రకాల బిర్యానీలను ప్రయత్నించండి.
రుచికరమైన మొఘలాయి వంటకాలతో ప్రసిద్ధి చెందిన ‘తోష్ ఇ దాన్’ రెస్టారెంట్లో సుఫియాని బిర్యానీ దొరుకుతుంది. ఈ వంటకంలో మిరపపొడి బదులు క్రీమీ, సుగంధభరిత పదార్థాలను ఉపయోగిస్తారు. ఇది బిర్యానీకి ప్రత్యేక రుచినిస్తుంది. ఎంతో అరుదైన ఈ రుచిని ఆస్వాదించడానికి చాలామంది ఈ రెస్టారెంట్కు వెళ్తుంటారు.
విజయవాడలో ప్రారంభమైన ఈ రెస్టారెంట్, ఇప్పుడు హైదరాబాద్వాసులకు షాహీ ఘోష్ బిర్యానీ రుచి చూపిస్తోంది. దీని రాయల్ రుచులు కస్టమర్లను ఎంతో ఆకట్టుకున్నాయి. గతకాలపు రుచులను, రాజవంశీయుల భోజనాన్ని గుర్తు చేసుకునేవారు ఈ బిర్యానీని ఇష్టపడతారు. ఇక్కడ ఇది అత్యంత ఎక్కువగా అమ్ముడవుతుంది.
జపనీస్ వంటకం ఒమురైస్ స్ఫూర్తితో రూపొందిన ఈ వినూత్న బిర్యానీ హైదరాబాద్లో బాగా పాపులర్. కారం ఎక్కువగా ఉండే మటన్ కీమా, రొయ్యలను ఒక సన్నని ఆమ్లెట్ పొరలో చుట్టి ఈ వంటకాన్ని తయారుచేస్తారు. ప్రత్యేకమైన ఈ ప్రెజెంటేషన్, రుచి కారణంగా ఇది తక్కువ సమయంలోనే బాగా ప్రాచుర్యం పొందింది.
టొలిచౌకిలోని ‘తేరీ మేరీ బిర్యానీ’ కరాచీ తరహా ఆలూ బిర్యానీని పరిచయం చేసింది. బిర్యానీలో బంగాళాదుంపలు వేయడం కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ, కరాచీ స్టైల్ రుచులను, బంగాళాదుంపల కాంబినేషన్ను ఇష్టపడేవారు దీనికి అలవాటు పడ్డారు. దీని కారం, రుచి నగరంలో కొత్త ట్రెండ్ను మొదలుపెట్టాయి.
కృష్ణపట్నం కిచెన్ స్లో కుక్ చేసిన లేత గొర్రె కాళ్ల మాంసంతో ఈ బిర్యానీని తయారుచేస్తుంది. నల్లి ఘోష్ను సుగంధభరిత బియ్యంలో కలిపి వండుతారు. ఇది నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉంటుంది. ఇక్కడి సంప్రదాయ, ప్రామాణిక రుచి కారణంగా కృష్ణపట్నం కిచెన్కు మంచి ఆదరణ దక్కింది.