
వంటగదిలో ఎక్కువగా ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో మిక్సర్లు, గ్రైండర్లు చాలా ముఖ్యమైనవి. చట్నీలు, మసాలాలు, సాంబార్ పొడులు వంటి రకరకాల ఆహార పదార్థాలను రుబ్బడానికి మనం వీటిని ప్రతిరోజూ ఉపయోగిస్తాము. అయితే నిరంతర ఉపయోగం వల్ల కాలక్రమేణా మిక్సర్ బ్లేడ్లు మొద్దుబారిపోతుంటాయి. దీనివల్ల మనం ఎంత రుబ్బినా పదార్థాలు మెత్తగా అవ్వవు, పైగా మిక్సీ మోటారుపై తీవ్ర ఒత్తిడి పడి అది పాడయ్యే ప్రమాదం ఉంది. మీ పని కూడా ఆలస్యం అవుతుంది. సాధారణంగా మిక్సర్ జార్ మొద్దుబారితే మనమందరం దానిని మెకానిక్ వద్దకు తీసుకువెళ్తాం లేదా జార్ను మార్చేస్తుంటాము. కానీ రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే ఒకే ఒక్క పదార్థంతో మొద్దుబారిన బ్లేడ్ను మళ్లీ కత్తిలా పదును పెట్టవచ్చని మీకు తెలుసా? ఆ సింపుల్ ట్రిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
మిక్సీ బ్లేడ్లను పదును పెట్టడానికి మన ఇంట్లో ఉండే ఉప్పు అద్భుతంగా పనిచేస్తుంది. అయితే, దీనికోసం మనం రోజూ వాడే మెత్తటి ఉప్పు పొడిని కాకుండా కల్లు ఉప్పు ఉపయోగించాలి. రాతి ఉప్పు ఒక అద్భుతమైన స్క్రబ్బర్గా పనిచేస్తూ, బ్లేడులను సహజంగానే పదును పెడుతుంది.
చివరగా ఒక రెండు నిమిషాల పాటు హై స్పీడ్లో మిక్సీని రన్ చేయాలి. దీనివల్ల లోపల ఉన్న ఉప్పు పూర్తిగా మెత్తటి పొడిగా మారుతుంది.
ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు రాతి ఉప్పు ఘర్షణ వల్ల బ్లేడ్లు కత్తిలా పదునుగా మారతాయి. అంతేకాదు జార్ లోపల, బ్లేడ్ల కింద పేరుకుపోయిన నలుపు, జిడ్డు, మురికి కూడా ర్తిగా మాయమై జార్ సరికొత్తగా మెరుస్తుంది.
ఒకవేళ మీ ఇంట్లో రాతి ఉప్పు అందుబాటులో లేకపోతే.. దానికి ప్రత్యామ్నాయంగా అల్యూమినియం ఫాయిల్ ఉపయోగించవచ్చు.
బ్లేడ్లు పదును పెట్టడం పూర్తయిన తర్వాత జార్ను శుభ్రం చేసుకోవడం మరువకూడదు. మిక్సీ పట్టిన ఉప్పును పారేయకుండా వేరే డబ్బాలో పెట్టుకుని తిరిగి వాడుకోవచ్చు.