దేశంలోనే అత్యంత పొడవైన రైలు మార్గాలు ఏమిటో తెలుసా.. వీటిలో ఒక రైలుకి 3 రోజుల ప్రయాణ సమయం పడుతుంది

|

Aug 08, 2024 | 10:58 AM

ఆసేతు హిమాచలం అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్, ఈశాన్య భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకూ ప్రయాణించడానికి రైళ్లకు చాలా సమయం పడుతుంది. వీటిలో 2 నుంచి 3 రోజులు ప్రయాణించే అనేక రైళ్లు ఉన్నాయి. ఇందులో అతి సుదీర్ఘంగా ప్రయాణించే 5 రైళ్లు ఉన్నాయి. ఈ రోజు మనం భారతీయ రైల్వేలలో ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్ల గురించి తెలుసుకుందాం..

దేశంలోనే అత్యంత పొడవైన రైలు మార్గాలు ఏమిటో తెలుసా.. వీటిలో ఒక రైలుకి 3 రోజుల ప్రయాణ సమయం పడుతుంది
Longest Train Route In India
Follow us on

భారతదేశంలో ప్రతిరోజూ చాలా మంది రైలులో ప్రయాణిస్తుంటారు. కొందరు వ్యక్తులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి 1 గంట పడుతుంది. మరికొందరు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి 2 నుండి 3 రోజులు ప్రయాణం చేస్తారు. అయితే ఆసేతు హిమాచలం అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్, ఈశాన్య భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకూ ప్రయాణించడానికి రైళ్లకు చాలా సమయం పడుతుంది. వీటిలో 2 నుంచి 3 రోజులు ప్రయాణించే అనేక రైళ్లు ఉన్నాయి. ఇందులో అతి సుదీర్ఘంగా ప్రయాణించే 5 రైళ్లు ఉన్నాయి. ఈ రోజు మనం భారతీయ రైల్వేలలో ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్ల గురించి తెలుసుకుందాం..

వివేక్ ఎక్స్‌ప్రెస్

భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లలో వివేక్ ఎక్స్‌ప్రెస్ పేరు కూడా ఉంది. ఈ రైలు అస్సాంలోని దిబ్రూఘర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకూ దాదాపు 4,200 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. రైలు వారానికోసారి నడుస్తుంది. ఈ రైలులో ప్రయాణాన్ని పూర్తి చేయడానికి సుమారు 80 గంటలు పడుతుంది. ఈ రైలు మార్గంలో 50 సార్లు కంటే ఎక్కువ ఆగుతుంది. ఈ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు అస్సాంలోని పచ్చని తేయాకు తోటల నుంచి కన్యాకుమారిలోని ఇసుక బీచ్‌ల వరకు ఉండే అందమైన దృశ్యాలను ప్రయాణికులు చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

హిమసాగర్ ఎక్స్‌ప్రెస్

హిమసాగర్ ఎక్స్‌ప్రెస్ అనేది తమిళనాడులోని కన్యాకుమారి నుంచి జమ్మూ కశ్మీర్‌లోని కత్రా వరకు నడిచే వారపు రైలు. ఇది దాదాపు 3,800 కి.మీ.ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఇది పొడవైన రైల్వే మార్గం. ఈ రైలు తన ప్రయాణాన్ని పూర్తి చేయడానికి సుమారు 73 గంటల 5 నిమిషాలు తీసుకుంటుంది. హిమసాగర్ ఎక్స్‌ప్రెస్ 12 రాష్ట్రాల గుండా వెళుతుంది. 71 స్టేషన్లలో ఆగుతుంది. కత్రాలోని వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించే ప్రయాణికులకు ఈ రైలు ఉత్తమ ఎంపిక.

దిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్

సుదీర్ఘంగా ప్రయాణించే రైళ్లలో దిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్ పేరు కూడా చేర్చబడింది. అస్సాంలోని న్యూ టిన్సుకియా నుంచి బయలుదేరి చివరి గమ్యస్థానానికి చేరుకునే ఈ రైలు 3,547 కి.మీ. ప్రయాణాన్ని పూర్తి చేయడానికి సుమారు 68 గంటలు పడుతుంది. మార్గంలో 35 స్టాప్‌లు ఉన్నాయి. దిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ, ప్రయాణికులు గౌహతి, కోల్‌కతా, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల ద్వారా సుందరమైన ప్రయాణాన్ని ఆనందిస్తారు.

కేరళ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్

కేరళ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ కేరళలోని తిరువనంతపురంను పంజాబ్‌తో కలుపుతూ 3,398 కి.మీ ప్రయాణిస్తుంది. ఈ ఎక్స్ ప్రెస్ తన గమ్యాన్ని చేరుకోవడానికి దాదాపు 54 గంటల 25 నిమిషాల సమయం పడుతుంది. యాత్రికులు భారతదేశం దక్షిణ, ఉత్తర ప్రాంతాల మధ్య ఉండే అందమైన ప్రదేశాలను చూడవచ్చు.

సిల్చార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

ఈ రైలు ప్రతివారం సిల్చార్, అస్సాం, సికింద్రాబాద్, గౌహతి మీదుగా తెలంగాణలో నడుస్తుంది. ఇది 2,875 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. అలాగే ఈ ట్రైన్ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి 54 గంటల 45 నిమిషాలు పడుతుంది.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..