శరీరంలోనే కాదు.. రక్తంలో కూడా వ్యర్థ పదార్థాలు పేరుకుపోతూ ఉంటాయి. రక్తంలోని వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపడం చాలా ముఖ్యం. లేదంటే.. బ్లడ్ ఇన్పెక్షన్స్, ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. బ్లడ్ ప్యూరీఫై అవ్వాలంటే.. కొన్ని రకాల ఆహారాలు తినడం చాలా ముఖ్యం.
రక్తం శుద్ధిగా ఉంటే శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరగుతుంది. నొప్పులు, వాపులు, మంటలు అనేవి తగ్గుతాయి. అలాగే చర్మం కూడా క్లియర్గా, గ్లోయింగ్గా ఉంటుంది. జీర్ణ శక్తి పెరిగి శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. కాబట్టి రక్తం శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం.
బీట్రూట్లో రక్తాన్ని శుభ్రం చేసే గుణాలు ఉన్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపతాయి. అంతే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే కొత్తిమీర కూడా రక్తాన్ని ప్యూరిఫై చేయడంలో హెల్ప్ చేస్తుంది.
అదేవిధంగా నిమ్మ కాయ కూడా రక్తాన్ని క్లీన్ చేయడంలో బాగా సహాయ పడుతుంది. నిమ్మకాయ రసం, నిమ్మకాయతో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల బ్లడ్ని క్లీన్ చేసి, లివర్ పని తీరును కూడా మెరుగు పడేలా చేస్తుంది.
ఇంట్లో లభ్యమయ్యే వాటిల్లో వెల్లుల్లి కూడా ఒకటి. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో చక్కగా సహాయ పడుతుంది. రక్తం, బాడీలోని ట్యాక్సిన్స్ని బయటకు పంపి.. లివర్ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.