
మహా శివరాత్రికి నైవేధ్యంగా పెట్టే ఈ రేగి పండ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం రేగు పండ్లలోని సహజ లక్షణాలు శరీరాన్ని లోపలి నుంచి బలోపేతం చేస్తాయి. ఉపవాస సమయంలో శక్తిని కాపాడుకోవడానికి సహాయపడతాయి. పోషకాలతో సమృద్ధిగా ఉండే పండ్లు రేగు పండ్లు. వీటిలో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఆయుర్వేద నిపుణులు కూడా రేగు పండ్లు తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. అవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీరానికి అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఖచ్చితంగా రేగు పండ్లను తినాలని సిఫార్సు చేస్తున్నారు. మహాశివరాత్రి పండుగ సమీపిస్తున్నందున రేగు పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..
రేగు పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇవి మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ప్రేగులను శుభ్రంగా ఉంచుతాయి.
రేగు పండ్లు విటమిన్ సి కి మంచి మూలం. ఇది శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. రేగు పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. కాలానుగుణ వ్యాధుల నుంచి కూడా రక్షణ పొందవచ్చు.
రేగు పండ్లలో ఐరన్, ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్ను పెంచడంలో సహాయపడతాయి. రక్తహీనతతో బాధపడేవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
రేగు పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తాయి. ముఖానికి సహజమైన మెరుపును ఇస్తాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం రేగు పండ్లలో సహజ చక్కెరలు, తక్షణ శక్తిని అందించే పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల అలసట, బలహీనత, బద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు రేగు పండ్లకు దూరంగా ఉండాలి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.