అది ఏ విధంగా పరిటాల రవి కల ఆవుతుంది..? శ్రీరామ్, దేవినేని ఉమకు కౌంటరిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి

|

Dec 11, 2020 | 10:09 PM

వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. టీడీపీ నేతలు పరిటాల శ్రీరామ్, దేవినేని ఉమకు కౌంటరిచ్చారు. టీడీపీ నేతలు వాస్తవాలు తెలియకుండా..

అది ఏ విధంగా పరిటాల రవి కల ఆవుతుంది..?  శ్రీరామ్, దేవినేని ఉమకు కౌంటరిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
Follow us on

వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. టీడీపీ నేతలు పరిటాల శ్రీరామ్, దేవినేని ఉమకు కౌంటరిచ్చారు. టీడీపీ నేతలు వాస్తవాలు తెలియకుండా విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. దేవినేని ఉమా చిత్తశుద్ధితో మాట్లాడాలన్నారు. “మీరు ప్రాజక్టులకు అంచనాలు పెంచుకున్నప్పుడు మీరెక్కడికి వెళ్లారు.. అంటూ నిలదీశారు. దోపిడీకి అంచనాలు పెంచుకున్నారా..?” అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో శంకుస్థాపనలు చేసిన వాటిని మా వైఎస్సార్ ముందుకు నడిపించారన్నారు. పరిటాల రవి చనిపోయిన తర్వాత జలయజ్ఞం ప్రారంభమైందన్న ఆయన, ఏ విధంగా పరిటాల రవి కల ఆవుతుంది..? అని నిలదీశారు. “మేము వస్తే ప్రాజెక్ట్ పేరు మారుస్తాం అంటున్నారు..మీరు అధికారంలోకి వస్తామని కల కంటున్నారా..?” అని పరిటాల శ్రీరామ్ అనిన వ్యాఖ్యల్ని ఎద్దేవా చేశారు.