AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా లాక్‌డౌన్‌: కొడుకు కోసం.. 6 రాష్ట్రాలు దాటి.. 2,700 కిలోమీటర్లు ప్రయాణించి..!

భారత్‌లో కోవిద్-19 వేగంగా విస్తరిస్తోంది. దీని కట్టడికోసం సామజిక దూరం పాటించడం తప్పనిసరి. అందుకే లాక్ డౌన్ కూడా పొడిగించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఒకటీ రెండూ కాదు... ఏకంగా 6 రాష్ట్రాలు దాటి 2,700 కిలోమీటర్లు

కరోనా లాక్‌డౌన్‌: కొడుకు కోసం.. 6 రాష్ట్రాలు దాటి.. 2,700 కిలోమీటర్లు ప్రయాణించి..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 18, 2020 | 2:12 PM

Share

భారత్‌లో కోవిద్-19 వేగంగా విస్తరిస్తోంది. దీని కట్టడికోసం సామజిక దూరం పాటించడం తప్పనిసరి. అందుకే లాక్ డౌన్ కూడా పొడిగించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఒకటీ రెండూ కాదు… ఏకంగా 6 రాష్ట్రాలు దాటి 2,700 కిలోమీటర్లు ప్రయాణించింది ఒక తల్లి. అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకును చూడటానికి ఆ తల్లి పడుతున్న ఆవేదనను గమనించిన అధికారులు, మానవత్వం కలిగిన వ్యక్తులు తమ శక్తి మేరకు సహకరించారు. దీనితో సుదీర్ఘ ప్రయాణం చేసి కొడుకును చూసుకున్నతల్లి సంతోషానికి అంతులేకుండా పోయింది. కేరళకు చెందిన అరుణ్ కుమార్ రాజస్తాన్ లోని జోధ్ పూర్ లో బీఎస్‌ఎఫ్‌ జవాన్‌గా పనిచేస్తున్నారు.

వివరాల్లోకెళితే.. ఫిబ్రవరిలో సెలవుపై గ్రామానికి వచ్చిన జవాన్‌ అనిల్‌ కుమార్‌ కొద్దిరోజుల తర్వాత తిరిగి జోధ్‌పూర్‌ వెళ్లిన కొద్దివారాలకే అస్వస్ధతకు లోనయ్యారు. తన ఆరోగ్యం బాగాలేదని తన తల్లి, భార్యను చూడాలని వైద్యులకు చెప్పడంతో వారు అనిల్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీనితో అతని తల్లి షీలమ్మ వాసన్‌ లాక్‌డౌన్‌ నియంత్రణలను లెక్కచేయకుండా కుమారుడిని చూసేందుకు బయలుదేరారు. పరిస్దితిని గమనించిన కొట్టాయం జిల్లా కలెక్టర్ పీకే సుధీర్‌ బాబు అవసరమైన పాస్‌లను ఇవ్వడంతో షీలమ్మతో పాటు ఆమె కోడలు, మరో బంధువు జోధ్ పూర్ ప్రయాణమయ్యారు.

కాగా.. వీహెచ్‌పీ అనుబంధ హిందూ హెల్ప్‌లైన్‌ సభ్యులు.. వీరికి ఓ క్యాబ్‌తో పాటు ఇద్దరు డ్రైవర్లను ఉచితంగా సమకూర్చారు. కేరళ సీఎం పినరయి విజయన్‌ కార్యాలయం, కాంగ్రెస్‌ నేత ఊమెన్‌ చాందీ, కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ వీరి ప్రయాణానికి తగిన చర్యలు తీసుకున్నారు. దీంతో వారు కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ల మీదుగామూడు రోజుల పాటు ప్రయాణించి రాజస్ధాన్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్బంగా షీలావాసన్ మాట్లాడుతూ దేవుడి దయ వల్ల ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా ఇక్కడకు చేరుకున్నామని తన కుమారుడి ఆరోగ్యం ఇప్పుడు కొద్దిగా మెరుగైందని ఆనందం వ్యక్తం చేసారు.

Follow Us
అవునా.. ఏసీ రూమ్‌లో ఈ వస్తువులను అస్సలు ఉంచకూడదు! ఎందుకో తెలుసా?
అవునా.. ఏసీ రూమ్‌లో ఈ వస్తువులను అస్సలు ఉంచకూడదు! ఎందుకో తెలుసా?
15 సిక్సర్లతో 169 పరుగులు.. అయినా, ఛీ కొట్టిన గంభీర్..!
15 సిక్సర్లతో 169 పరుగులు.. అయినా, ఛీ కొట్టిన గంభీర్..!
ప్రతి భారతీయుడి ఫోన్‌లో ఉండాల్సిన 5 ముఖ్యమైన యాప్స్‌..
ప్రతి భారతీయుడి ఫోన్‌లో ఉండాల్సిన 5 ముఖ్యమైన యాప్స్‌..
ప్రెజర్ కుక్కర్ మూత ఇరుక్కపోయి సరిగ్గా రావడం లేదా..ఈ చిన్న ట్రిక్
ప్రెజర్ కుక్కర్ మూత ఇరుక్కపోయి సరిగ్గా రావడం లేదా..ఈ చిన్న ట్రిక్
ఊర్లల్లోని ఇళ్ల పక్కనే మహౌషధం.. మునగాకు ప్రయోజనాలు తెలిస్తే..
ఊర్లల్లోని ఇళ్ల పక్కనే మహౌషధం.. మునగాకు ప్రయోజనాలు తెలిస్తే..
పోలీసుల వేధింపులతోనే యువకుడి మృతి? తాడికొండ ఘటనపై బంధువుల ఆగ్రహం!
పోలీసుల వేధింపులతోనే యువకుడి మృతి? తాడికొండ ఘటనపై బంధువుల ఆగ్రహం!
పాకిస్తాన్ కపటబుద్ధి.. ఎస్‌సీవో సదస్సులో పీఎం మోదీ ఫొటో కట్ చేసి.
పాకిస్తాన్ కపటబుద్ధి.. ఎస్‌సీవో సదస్సులో పీఎం మోదీ ఫొటో కట్ చేసి.
పవన్‌కు చంద్రబాబు స్పెషల్ కాల్..!
పవన్‌కు చంద్రబాబు స్పెషల్ కాల్..!
41 బంతుల్లో శివతాండవం.. 265 పరుగుల టార్గెట్‌ని ఊదేసిన జలంధర్..!
41 బంతుల్లో శివతాండవం.. 265 పరుగుల టార్గెట్‌ని ఊదేసిన జలంధర్..!
ఇంట్లో ఆడపిల్ల ఉందా? నెలకు ఎంత పొదుపు చేస్తే రూ.70 లక్షలు వస్తాయి
ఇంట్లో ఆడపిల్ల ఉందా? నెలకు ఎంత పొదుపు చేస్తే రూ.70 లక్షలు వస్తాయి