AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా లాక్‌డౌన్‌: కొడుకు కోసం.. 6 రాష్ట్రాలు దాటి.. 2,700 కిలోమీటర్లు ప్రయాణించి..!

భారత్‌లో కోవిద్-19 వేగంగా విస్తరిస్తోంది. దీని కట్టడికోసం సామజిక దూరం పాటించడం తప్పనిసరి. అందుకే లాక్ డౌన్ కూడా పొడిగించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఒకటీ రెండూ కాదు... ఏకంగా 6 రాష్ట్రాలు దాటి 2,700 కిలోమీటర్లు

కరోనా లాక్‌డౌన్‌: కొడుకు కోసం.. 6 రాష్ట్రాలు దాటి.. 2,700 కిలోమీటర్లు ప్రయాణించి..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 18, 2020 | 2:12 PM

Share

భారత్‌లో కోవిద్-19 వేగంగా విస్తరిస్తోంది. దీని కట్టడికోసం సామజిక దూరం పాటించడం తప్పనిసరి. అందుకే లాక్ డౌన్ కూడా పొడిగించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఒకటీ రెండూ కాదు… ఏకంగా 6 రాష్ట్రాలు దాటి 2,700 కిలోమీటర్లు ప్రయాణించింది ఒక తల్లి. అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకును చూడటానికి ఆ తల్లి పడుతున్న ఆవేదనను గమనించిన అధికారులు, మానవత్వం కలిగిన వ్యక్తులు తమ శక్తి మేరకు సహకరించారు. దీనితో సుదీర్ఘ ప్రయాణం చేసి కొడుకును చూసుకున్నతల్లి సంతోషానికి అంతులేకుండా పోయింది. కేరళకు చెందిన అరుణ్ కుమార్ రాజస్తాన్ లోని జోధ్ పూర్ లో బీఎస్‌ఎఫ్‌ జవాన్‌గా పనిచేస్తున్నారు.

వివరాల్లోకెళితే.. ఫిబ్రవరిలో సెలవుపై గ్రామానికి వచ్చిన జవాన్‌ అనిల్‌ కుమార్‌ కొద్దిరోజుల తర్వాత తిరిగి జోధ్‌పూర్‌ వెళ్లిన కొద్దివారాలకే అస్వస్ధతకు లోనయ్యారు. తన ఆరోగ్యం బాగాలేదని తన తల్లి, భార్యను చూడాలని వైద్యులకు చెప్పడంతో వారు అనిల్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీనితో అతని తల్లి షీలమ్మ వాసన్‌ లాక్‌డౌన్‌ నియంత్రణలను లెక్కచేయకుండా కుమారుడిని చూసేందుకు బయలుదేరారు. పరిస్దితిని గమనించిన కొట్టాయం జిల్లా కలెక్టర్ పీకే సుధీర్‌ బాబు అవసరమైన పాస్‌లను ఇవ్వడంతో షీలమ్మతో పాటు ఆమె కోడలు, మరో బంధువు జోధ్ పూర్ ప్రయాణమయ్యారు.

కాగా.. వీహెచ్‌పీ అనుబంధ హిందూ హెల్ప్‌లైన్‌ సభ్యులు.. వీరికి ఓ క్యాబ్‌తో పాటు ఇద్దరు డ్రైవర్లను ఉచితంగా సమకూర్చారు. కేరళ సీఎం పినరయి విజయన్‌ కార్యాలయం, కాంగ్రెస్‌ నేత ఊమెన్‌ చాందీ, కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ వీరి ప్రయాణానికి తగిన చర్యలు తీసుకున్నారు. దీంతో వారు కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ల మీదుగామూడు రోజుల పాటు ప్రయాణించి రాజస్ధాన్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్బంగా షీలావాసన్ మాట్లాడుతూ దేవుడి దయ వల్ల ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా ఇక్కడకు చేరుకున్నామని తన కుమారుడి ఆరోగ్యం ఇప్పుడు కొద్దిగా మెరుగైందని ఆనందం వ్యక్తం చేసారు.

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్