పచ్చని సంసారంలో అనుమానపు చిచ్చు

| Edited By:

Apr 17, 2019 | 12:36 PM

తమిళనాడులోని ఈరోడ్‌‌లో ఓ అనుమానపు భర్త భార్య తల నరికేశాడు. అంతేకాకుండా ఆమె మృతదేహన్ని బైక్‌పై పెట్టుకుని షికార్లు కొట్టాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కర్ణాటకకు చెందిన మునియప్పన్(18), నివేద(19)కు 8నెలల క్రితం వివాహమైంది. వీరు ఉపాధి నిమిత్తం తమిళనాడులోని ఈరోడ్‌ నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెట్టుకడాయ్ ప్రాంతంలో నివాసముంటున్నారు. మునియప్పన్ స్థానికంగా ఓ గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తుండగా, నివేద ఓ దుకాణంలో పనిచేస్తోంది. ఇటీవల మునియప్పన్ నివేదపై అనుమానం […]

పచ్చని సంసారంలో అనుమానపు చిచ్చు
Follow us on

తమిళనాడులోని ఈరోడ్‌‌లో ఓ అనుమానపు భర్త భార్య తల నరికేశాడు. అంతేకాకుండా ఆమె మృతదేహన్ని బైక్‌పై పెట్టుకుని షికార్లు కొట్టాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

కర్ణాటకకు చెందిన మునియప్పన్(18), నివేద(19)కు 8నెలల క్రితం వివాహమైంది. వీరు ఉపాధి నిమిత్తం తమిళనాడులోని ఈరోడ్‌ నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెట్టుకడాయ్ ప్రాంతంలో నివాసముంటున్నారు. మునియప్పన్ స్థానికంగా ఓ గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తుండగా, నివేద ఓ దుకాణంలో పనిచేస్తోంది. ఇటీవల మునియప్పన్ నివేదపై అనుమానం పెంచుకున్నాడు. తన భార్య ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించి రోజూ వేధిస్తున్నాడు. దీనిపై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన మునియప్పన్ ఇదే విషయమై భార్యతో గొడవపడ్డాడు.

విచక్షణ కోల్పోయిన మునియప్పన్ భార్యను తీవ్రంగా కొట్టాడు. అనంతరం కత్తితో పొడవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత భార్య తలను శరీరం నుంచి వేరుచేసి గోనె సంచీలో వేశాడు. కాలువలో పడేసేందుకు సంచిని బైక్‌కు కట్టి బయలుదేరాడు. అర్థరాత్రి వేళ నగరంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అతడిని కొందరు అనుమానించారు. గోనెసంచిలో నుంచి కాళ్లు బయటకు రావడంతో భయాందోళనకు గురైన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మునియప్పన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి మునియప్పన్‌పై హత్య కేసు నమోదుచేశారు. ఈ ఘటన ఈరోడ్‌లో కలకలం రేపింది.