వెంకయ్య కొత్త స్తోత్రం.. సుప్రీం స్టేటస్‌కే ఎసరా..?

| Edited By:

Sep 28, 2019 | 7:57 AM

భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సత్వర న్యాయం దక్కాలంటే న్యాయ వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తీసుకురావలని అభిప్రాయపడ్డారు. నెల్లూరు జిల్లాకు చెందిన దివంగత సీనియర్‌ న్యాయవాది పీపీ రావుకి సంబంధించిన పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు.. ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు దేశ వ్యాప్తంగా ప్రాంతీయ బెంచ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు న్యాయమూర్తుల ఖాళీలు కూడా భర్తీ చేయాలని, వాయిదాలు తగ్గించి వీలైనంత […]

వెంకయ్య కొత్త స్తోత్రం.. సుప్రీం స్టేటస్‌కే ఎసరా..?
Follow us on

భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సత్వర న్యాయం దక్కాలంటే న్యాయ వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తీసుకురావలని అభిప్రాయపడ్డారు. నెల్లూరు జిల్లాకు చెందిన దివంగత సీనియర్‌ న్యాయవాది పీపీ రావుకి సంబంధించిన పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు.. ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు దేశ వ్యాప్తంగా ప్రాంతీయ బెంచ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు న్యాయమూర్తుల ఖాళీలు కూడా భర్తీ చేయాలని, వాయిదాలు తగ్గించి వీలైనంత త్వరగా కేసులను పరిష్కరించాలన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ సభ్యుల పార్టీ ఫిరాయింపు చట్టంపై సమీక్ష జరగాలని అభిప్రాయపడ్డారు. ఆరు నెలల నుంచి ఏడాది లోపు పార్టీ ఫిరాయింపుల కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక జ్యూడిషియల్ ట్రిబ్యూనల్ తీసుకురావాలన్నారు. అంతేకాదు.. ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న క్రిమినల్ కేసులను.. ఏడాదిలోగా విచారణ పూర్తి చేసే విధంగా చూడాలన్నారు. ఎన్నికల సంబంధిత కేసుల విచారణ కోసం ప్రత్యేక బెంచ్‌‌ను ఏర్పాటు చేయాలన్నారు.