వెలాసిటీదే తొలి విజయం

అమ్మాయిల ధనాధన్ లీగ్‌కు సూపర్ ఆరంభం దక్కింది. షార్జా వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో వెలాసిటీ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. వెలాసిటీ జట్టు 5 వికెట్ల తేడాతో సూపర్‌నోవాస్ పై గెలుపొందింది.

వెలాసిటీదే తొలి విజయం

Updated on: Nov 04, 2020 | 11:40 PM

అమ్మాయిల ధనాధన్ లీగ్‌కు సూపర్ ఆరంభం దక్కింది. షార్జా వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో వెలాసిటీ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. వెలాసిటీ జట్టు 5 వికెట్ల తేడాతో సూపర్‌నోవాస్ పై గెలుపొందింది.

ఆఖరి వరకు పట్టువదలకుండా విజయం కోసం పోరాడిన వెలాసిటీ ఇంకో బంతి మిగిలుండగానే టార్గెట్‌ను ఛేదించింది. 127 పరుగుల లక్ష్య చేధనతో పోరులోకి దిగిన సుష్మా వర్మ(34), సునె లూస్‌(37 నాటౌట్‌) గొప్పగా రాణించారు. వేద కృష్ణమూర్తి(29) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. సూపర్‌నోవాస్‌ బౌలర్లలో అయభాంగ ఖాకా రెండు వికెట్లు తీయగా రాధా యాదవ్‌, పూనమ్‌ యాదవ్‌, శశికళ తలో వికెట్‌ పడగొట్టారు.

ఓపెనర్‌ చమరి ఆటపట్టు (44/39 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(31/27 బంతుల్లో 1ఫోర్‌, 2సిక్సర్లు) రాణించడంతో సూపర్‌ నోవాస్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 126 పరుగులు చేసింది. వెలాసిటీ బౌలర్లలో ఏక్తా బిస్త్‌ మూడు వికెట్లు పడగొట్టగా జహనారా ఆలం, కాస్పర్క్‌ చెరో రెండు వికెట్లు తీశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us