
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులుం మద్దవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ ప్రదీప్ కుమార్ జోషీ బుధవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్రపతి భవన్ బుధవారం ఇచ్చిన ఓ ట్వీట్లో ఈ వివరాలను తెలిపింది. ‘‘యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ ప్రదీప్ కుమార్ జోషీ బుధవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో సమావేశమయ్యారు’’ అని రాష్ట్రపతి భవన్ ఇచ్చిన ట్వీట్లో తెలిపింది. ఈ భేటీకి సంబంధించిన ఓ ఫొటోను కూడా జత చేసింది. జోషీ ఈ నెల 7న యూపీఎస్సీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు.
Read More:
ఏపీలోని ఆ జిల్లాలో.. 50 ఏళ్లు పైబడిన వారికి.. నో హోమ్ ఐసోలేషన్..!