ఉద్యోగుల మృతిపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతాపం

టీటీడీ ఉద్యోగుల మృతిపై టీటీడీ ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి సంతాపం ప్ర‌క‌టించారు. అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన ఇద్దరు టీటీడీ ఉద్యోగులకు, ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో ఏఈఈగా..

ఉద్యోగుల మృతిపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతాపం

Edited By:

Updated on: Aug 19, 2020 | 9:06 PM

YV Subbareddy mourns the death of TTD Employees: టీటీడీ ఉద్యోగుల మృతిపై టీటీడీ ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి సంతాపం ప్ర‌క‌టించారు. అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన ఇద్దరు టీటీడీ ఉద్యోగులకు, ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో ఏఈఈగా పని చేస్తున్న టి.గురుమూర్తి బుధవారం కన్నుమూయడం బాధాకరమన్నారు. ఆయన సుదీర్ఘ కాలం ఎంతో సేవ చేశారని చైర్మన్ చెప్పారు. అలాగే పబ్లికేషన్ విభాగంలో అటెండర్‌గా పనిచేస్తున్న రవి కుమార్ సోమవారం కన్నుమూశారని తెలిపారు. రవి కుమార్ కూడా టీటీడీలో సుదీర్ఘకాలం సేవలందించారని వైవీ సుబ్బారెడ్డి కొనియాడారు. ఇద్దరు ఉద్యోగుల కుటుంబసభ్యులకు చైర్మన్ సానుభూతి ప్రకటించారు.

Also Read:

బ్రేకింగ్: ఓటీటీలో విడుద‌ల కానున్న `వి` సినిమా

Kushboo Eye Injury : ప్ర‌ముఖ న‌టి కుష్బూ కంటికి గాయం

మెట్రో ఉద్యోగుల జీతభ‌త్యాల్లో 50 శాతం కోత‌

న‌టి శివ పార్వ‌తికి క‌రోనా పాజిటివ్.. ఎవ‌రూ ప‌ట్టించుకోలేదంటూ ఆవేద‌న‌!

Follow Us