తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి బిల్డింగ్ పెచ్చులు ఊడి అటెండర్ రాధిక మృతి.. పలువురికి గాయాలు

|

Oct 05, 2020 | 11:21 AM

నిర్మాణ సంస్థల లోపభూయిష్ట పనులకు మరో నిండు ప్రాణం బలైపోయింది. తన చేతులతో ఎందరో కొవిడ్ రోగులకు సేవలందించి బ్రతికించిన అటెండర్ అకారణంగా అదే ఆస్పత్రిలో తుదిశ్వాస విడించింది. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలోని పద్మావతి కోవిడ్ సెంటర్ లో బిల్డింగ్ పెచ్చులు(శకలాలు) ఊడిపడి రాధిక అనే అటెండర్ అక్కడిక్కడే చనిపోయింది. మరో ఇద్దరు ఉద్యోగులకు గాయాలయ్యాయి. ప్రమాదంలో ఇద్దరు కోవిడ్ పాజిటివ్ పేషంట్లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. కోవిడ్ పాజిటివ్ రావడంతో బ్రతుకు జీవుడా అంటూ ఆసుపత్రిలో […]

తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి బిల్డింగ్ పెచ్చులు ఊడి అటెండర్ రాధిక మృతి.. పలువురికి గాయాలు
Follow us on

నిర్మాణ సంస్థల లోపభూయిష్ట పనులకు మరో నిండు ప్రాణం బలైపోయింది. తన చేతులతో ఎందరో కొవిడ్ రోగులకు సేవలందించి బ్రతికించిన అటెండర్ అకారణంగా అదే ఆస్పత్రిలో తుదిశ్వాస విడించింది. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలోని పద్మావతి కోవిడ్ సెంటర్ లో బిల్డింగ్ పెచ్చులు(శకలాలు) ఊడిపడి రాధిక అనే అటెండర్ అక్కడిక్కడే చనిపోయింది. మరో ఇద్దరు ఉద్యోగులకు గాయాలయ్యాయి. ప్రమాదంలో ఇద్దరు కోవిడ్ పాజిటివ్ పేషంట్లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. కోవిడ్ పాజిటివ్ రావడంతో బ్రతుకు జీవుడా అంటూ ఆసుపత్రిలో చేరేందుకు వచ్చిన బాధితులు రక్తమోడుతున్న గాయాలతో బెడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. రాత్రి పదిన్నర గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇటీవలే ఈ బిల్డింగ్ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో కొత్త భవనంలో కోవిడ్ సెంటర్ ను అధికారులు ప్రారంభించారు.