ఫోన్ కొట్టేశాడు.. క్వారంటైన్‌కు తరలించారు..

| Edited By:

Jun 19, 2020 | 11:34 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా బాధితులు ఉన్న ఆస్పత్రుల దగ్గరకు వెళ్లాలంటేనే జనం హడలిపోతున్నారు.

ఫోన్ కొట్టేశాడు.. క్వారంటైన్‌కు తరలించారు..
Follow us on

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా బాధితులు ఉన్న ఆస్పత్రుల దగ్గరకు వెళ్లాలంటేనే జనం హడలిపోతున్నారు. అయితే, ఓ దొంగ ఏమాత్రం భయం లేకుండా కరోనా బాధితుడి మొబైల్ కొట్టేశాడు. అస్సాం చిరాంగ్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులోకి ప్రవేశించిన పప్పూబుర్మన్.. కరోనా బాధితుడి ఫోన్ ఎత్తుకెళ్లాడు. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా నిందితుడిని పట్టుకున్న పోలీసులు మొబైల్ ద్వారా కరోనా సోకిందన్న అనుమానంతో టెస్టు చేయించి క్వారంటైన్ కు పంపారు.

Also Read: ఆన్‌లైన్‌ బోధనకోసం ‘విద్యాదాన్’