తెలంగాణ: స్టూడెంట్స్ పరీక్షలపై స్పందించిన కేటీఆర్..
సామాజిక మాధ్యమాల్లో యమ యాక్టివ్గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్ #AskKTR పేరుతో ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో సంభాషణలు జరిపారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన పలు ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చారు. కరోనాను అరికట్టేందుకు లాక్ డౌన్ ను పొడిగించాలన్నది తమ పార్టీ వ్యక్తిగత అభిప్రాయమని, అయితే ప్రభుత్వంతో పాటు ఇతర పక్షాలతో కలిసి ఫైనల్ డెషిసన్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత లాక్ డౌన్ ద్వారా డిసిప్లెన్ వచ్చిందని.. దీన్ని ఫ్యూచర్ లోనూ కొనసాగించాలని కోరారు. విద్యార్థుల […]
సామాజిక మాధ్యమాల్లో యమ యాక్టివ్గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్ #AskKTR పేరుతో ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో సంభాషణలు జరిపారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన పలు ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చారు. కరోనాను అరికట్టేందుకు లాక్ డౌన్ ను పొడిగించాలన్నది తమ పార్టీ వ్యక్తిగత అభిప్రాయమని, అయితే ప్రభుత్వంతో పాటు ఇతర పక్షాలతో కలిసి ఫైనల్ డెషిసన్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత లాక్ డౌన్ ద్వారా డిసిప్లెన్ వచ్చిందని.. దీన్ని ఫ్యూచర్ లోనూ కొనసాగించాలని కోరారు.
విద్యార్థుల ఎగ్జామ్స్ గురించి పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారని అయితే ప్రజంట్ ఉన్నది సంక్షోభ సమయమన్న మంత్రి, ఇలాంటి సమయంలో కొంత సహనం ఉండాలని సూచించారు. పరీక్షల షెడ్యూల్ కి సంబంధించి ప్రభుత్వం సరైన సమయంలో ఒక డెషిసన్ తీసుకుంటుందని వెల్లడించారు. ఒకవేళ ప్రపంచమంతా ఒప్పుకుంటే కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏడాదికి కనీసం పది రోజుల పాటు పరిమిత స్థాయిలో లాక్ డౌన్ ప్రకటిస్తే.. బాగుంటుందని ఒక నెటిజన్ ప్రశ్నించగా… తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు మంత్రి. ప్రస్తుత లాక్ డౌన్ వలన కాలుష్యం, భూతాపం వంటివి తగ్గాయని సంతోషం వ్యక్తం చేశారు.