కరోనా అప్‌డేట్ : తెలంగాణలో కొత్తగా 1,602 పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతోంది. గత మూడు రోజుల నుంచి 1500లకు పైగానే కేసులు నమోదవుతున్నాయి.

కరోనా అప్‌డేట్ : తెలంగాణలో కొత్తగా 1,602 పాజిటివ్ కేసులు
Follow us

|

Updated on: Nov 06, 2020 | 9:16 AM

తెలంగాణలో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతోంది. గత మూడు రోజుల నుంచి 1500లకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,602 పాజిటివ్ కేసులు నమోదయినట్టు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్‌‌లో తెలిపింది. ఫలితంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,47,284కి చేరింది. నిన్న ఒక్కరోజే వైరస్ కారణంగా నలుగురు ప్రాణాలు విడిచారు. దీంతో మృతుల సంఖ్య 1,366కి చేరింది. వైరస్ బారి నుంచి నిన్న 982 మంది కోలుకోగా..ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,26,646కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,272 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 16,522 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 295 కేసులు నమోదయ్యాయి.

Also Read :

మాజీ మావోయిస్టు పద్మావతి అలియాస్ పద్మక్క అరెస్ట్

ఆ అడుగు పడి సరిగ్గా మూడేళ్లు

కరోనా భయం : చీరల మధ్య చదువులు

విజయ్ పొలిటికల్ ఎంట్రీ వార్తలపై స్పందించిన సీఎం పళనిస్వామి