కరోనా భయం : చీరల మధ్య చదువులు
స్కూళ్లలో విద్యార్థులు, టీచర్లకు కరోనా సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా గడివేములలో...
స్కూళ్లలో విద్యార్థులు, టీచర్లకు కరోనా సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా గడివేములలో ఓ ఉపాధ్యాయుడు – విద్యార్థులకు కరోనా సోకకుండా ఉండటానికి వినూత్నమైన ఆలోచన చేశాడు. క్లాస్ రూంలో చెప్పాల్సిన పాఠాలను ఆరుబయట చెబుతున్నాడు. అంతేనా… విద్యార్థుల మధ్య నిలువునా చీరలు కట్టి పాఠాలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఆ టీచర్ పాఠాలు చెబుతూ తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అయ్యింది.
గడివేముల జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు కరోనా రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు టీచర్ నూరుల్లా రకీబ్. 9, 10 తరగతుల ఉర్దూ మీడియం విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు చీరలతో ప్రత్యేక అరలుగా విభజించారు. ఉపాధ్యాయుడు రకీబ్ ఆలోచనను పలువురు ప్రశంసిస్తూ ఉండగా… ఉన్నతాధికారులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో చీరలు తొలగించి భౌతిక దూరం పాటిస్తూ ఆ టీచర్ పాఠాలు చెబుతున్నారు.
Also Read :