తాజ్​మహల్​ సందర్శనకు నో ప‌ర్మిష‌న్…

|

Jul 06, 2020 | 12:52 PM

ప్ర‌స్తుతం దేశంలో లాక్​డౌన్ ముగిసి అన్ లాక్ ప్ర‌క్రియ కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పలు టూరిస్టు ప్లేసుల‌ను సోమవారం నుంచి పునఃప్రారంభించేందుకు ప్ర‌భుత్వం​ అనుమతిచ్చింది.

తాజ్​మహల్​ సందర్శనకు నో ప‌ర్మిష‌న్...
Follow us on

ప్ర‌స్తుతం దేశంలో లాక్​డౌన్ ముగిసి అన్ లాక్ ప్ర‌క్రియ కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పలు టూరిస్టు ప్లేసుల‌ను సోమవారం నుంచి పునఃప్రారంభించేందుకు ప్ర‌భుత్వం​ అనుమతిచ్చింది. ఈ క్ర‌మంలో ​ ప్రపంచ ప్రఖ్యాత తాజ్​మహల్​​ను సంద‌ర్శించాల‌నుకున్న ఆశావ‌హులు ఇంకొంత కాలం వేచి చూడాల్సిన ప‌రిస్థితుల ఏర్ప‌డ్డాయి. యూపీలోని​ ఆగ్రాలో కోవిడ్‌-19 విజృంభిస్తున్న నేపథ్యంలో.. తాజ్​మహల్​ సహా సిటీలోని ఇతర చారిత్రక కట్టడాలను మూసివేసే ఉంచాలని అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. ముందు తాజ్​మహల్​​ సంద‌ర్శ‌న‌కు అనుమ‌తి ఇచ్చినప్ప‌టికీ.. మూసివేసే ఉంచాలని జిల్లా యంత్రాంగం చివరి నిమిషంలో ఆదేశాలు జారీ చేసింది.

కాగా ఆగ్రా జిల్లాలో గత నాలుగు రోజుల్లో 55 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం 71 కంటైన్​మెంట్​ జోన్లు ఉన్నాయి. ఈ సమయంలో చారిత్రక కట్టడాలను తెరిచి సంద‌ర్శ‌కుల‌కు అనుమతిస్తే.. వైరస్​ ఉద్ధృతి మరింత పెరిగే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో అధికారులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.