రంగు పడుద్ది ! టాయిలెట్ కి మా పార్టీ రంగులా ? సమాజ్ వాదీ పార్టీ ఫైర్

| Edited By: Anil kumar poka

Oct 29, 2020 | 3:35 PM

ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్ లోని ఓ రైల్వే ఆసుపత్రి టాయిలెట్ పై సమాజ్ వాదీ పార్టీ 'పోరుకు' దిగింది. ఆ టాయిలెట్ కి వాడిన రంగులు తమ పార్టీ పతాకం కలర్ని పోలి ఉన్నాయట..

రంగు పడుద్ది ! టాయిలెట్ కి మా పార్టీ రంగులా ? సమాజ్ వాదీ పార్టీ ఫైర్
Follow us on

ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్ లోని ఓ రైల్వే ఆసుపత్రి టాయిలెట్ పై సమాజ్ వాదీ పార్టీ ‘పోరుకు’ దిగింది. ఆ టాయిలెట్ కి వాడిన రంగులు తమ పార్టీ పతాకం కలర్ని పోలి ఉన్నాయట.. మరే సమస్యా లేనట్టు దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ పార్టీ నేతలు హెచ్ఛరించారు. గోరఖ్ పూర్ లోని లలిత్ నారాయణ్ మిశ్రా రైల్వే ఆసుపత్రి టాయిలెట్ కి ఎరుపు, ఆకుపచ్చని రంగుల టైల్స్ ని వాడారు ఆ బిల్డింగ్ డిజైనర్లు. ఈ రంగులు మా పార్టీవే ! ఇలా వాడడానికి వీల్లేదు.. వెంటనే ఆ కలర్స్ మార్చండి..లేదా..! అంటూ గురువారం ఉదయం ఇక్కడ చేరిన సమాజ్ వాదీ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రి యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చారు.   ఇలాంటి హెచ్ఛరిక ఎక్కడా వినలేదంటూ హాస్పిటల్ మేనేజ్ మెంట్ విసుక్కొంటోంది.