పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సన్నాహాలు మొదలు

| Edited By: Pardhasaradhi Peri

Sep 10, 2020 | 6:06 PM

ఈ నెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఎన్నికైన అనేకమంది ఎంపీలు తొలిసారిగా ఈ చట్ట సభలోకి అడుగు పెట్టనున్నారు. కరోనా వైరస్ పాండమిక్ నేపథ్యంలో..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సన్నాహాలు మొదలు
Follow us on

ఈ నెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఎన్నికైన అనేకమంది ఎంపీలు తొలిసారిగా ఈ చట్ట సభలోకి అడుగు పెట్టనున్నారు. కరోనా వైరస్ పాండమిక్ నేపథ్యంలో ఈ సమావేశాలను అత్యంత జాగ్రత్తగా నిర్వహించేందుకు అన్ని ముందు జాగ్రత్త చర్యలూ తీసుకుంటున్నారు.  ఈ సందర్భంగా మాట్లాడిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా.. 257 మంది సభ్యులు లోక్ సభ హాలులో, 172 మంది లోక్ సభ గ్యాలరీలో కూర్చుంటారని చెప్పారు. అలాగే 60 మంది రాజ్యసభ హాలులో, 51 మంది ఎంపీలు రాజ్యసభ గ్యాలరీలో ఆసీనులవుతారని వివరించారు. ప్రొసీడింగ్స్ సజావుగా సాగేందుకు  పెద్ద ఎల్ ఈడీ స్క్రీన్స్ ని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఎంపీలంతా ఆర్ టీ, వీసీఆర్ టెస్టులను ముందే చేయించుకోవాలని ఓం బిర్లా సూచించారు. ఎంపీలకు డిజిటల్ అటెండెన్స్ సౌకర్యం ఉంటుందని, ఈ కరోనా  కాలంలో పార్లమెంట్ సమావేశాలను నిర్వహించడం సవాలు వంటిదేనని ఆయన వ్యాఖ్యానించారు.