బంగారం,వజ్ర వైఢూర్యాలు కలిగిన రైలు మిస్సింగ్.. ఆగని అన్వేషణ!

|

Oct 21, 2020 | 6:35 PM

ఎప్పుడో రెండో ప్రపంచం యుద్ధం నాటి రైలు కోసం పోలాండ్‌లోని ఔల్ పర్వత శ్రేణుల్లో ఔత్సాహికులు ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నారు. ఆ రైల్ స్పెషల్ ఏంటి.? ..

బంగారం,వజ్ర వైఢూర్యాలు కలిగిన రైలు మిస్సింగ్.. ఆగని అన్వేషణ!
Follow us on

Nazi Ghost Train: ఎప్పుడో రెండో ప్రపంచం యుద్ధం నాటి రైలు కోసం పోలాండ్‌లోని ఔల్ పర్వత శ్రేణుల్లో ఔత్సాహికులు ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నారు. ఆ రైల్ స్పెషల్ ఏంటి.? ఎందుకు ఇప్పటికీ వెతుకుతున్నారు.? అనే సందేహాలు కలగవచ్చు. ఆ రైలులో గుప్త నిధి ఉంది. బంగారం, రత్నాలు, ఆయుధాలతో నిండిన ఆ రైలును రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఔల్ పర్వత శ్రేణుల్లో దాచిపెట్టారని ఇప్పటికీ ప్రచారం సాగుతోంది. వివరాల్లోకి వెళ్తే..

రెండో ప్రపంచ యుద్ధం వేళ నాజి పార్టీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ ‘జైయింట్’ ప్రాజెక్ట్‌లో భాగంగా పోలాండ్‌లోని ఔల్ పర్వతాల్లో రహస్య భూ సొరంగాలను నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారని సమాచారం. ఇక యుద్ధం చివరి రోజుల్లో దాదాపు 300 టన్నుల బంగారం, వజ్ర వైఢూర్యాలు, ఆయుధాలను నాజీ సైనికులు ఓ చిన్న రైలులో నింపి.. ఆ సొరంగాల్లో పాతి పెట్టారట. ఆ ప్రచారం ఎన్నో దశాబ్దాలుగా సాగుతూ వచ్చింది. వేలాది మంది ప్రయత్నించినా ఇప్పటికీ ఆ రైలు జాడ దొరకలేదు.

రెండేళ్ల క్రిందట కూడా ఓ న్యాయ సంస్థకు చెందిన ఇద్దరు వ్యక్తులు సౌత్ వెస్ట్రన్ పోలిష్ డిస్ట్రిక్ట్‌ వాల్‌బ్రిజిచ్‌లోని అధికారిక కార్యాలయాన్ని సంప్రదించి.. ఆ రైలు జాడను తమకు తెలియజేస్తే.. 10 శాతం వాటా ఇస్తామని లేఖలు రాశారని అక్కడి అధికారి ఒకరు తెలిపారు. దీని బట్టి చూస్తే ప్రజలు ఇంకా ఆ గుప్తనిధి కలిగిన రైలు కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.