ఆ నిధులు కూడా మింగేశారు: ఎంపీ విజయసాయి ట్వీట్

| Edited By:

Jul 04, 2019 | 3:37 PM

రాజకీయ నేతలు ప్రత్యక్షంగా కంటే పరోక్షంగానే యుద్ధాలు చేసుకుంటున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అధికార విపక్షాల మధ్య ట్విట్టర్ వేదికగా ఇరుపార్టీల నేతలు సై అంటే సై అంటున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడిపీ నేతల అవినీతిపై కామెంట్స్ చేశారు. తాజగా చేసిన ట్వీట్‌లో “పేద కుటుంబాలకు మరుగుదొడ్ల నిర్మాణం కోసం కేటాయించిన నిధులను టీడీపీ నేతలు మింగేశారంటూ ఆరోపించారు. పార్టీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన నివాసంతోపాటు, అప్పటి మంత్రుల ఇళ్లలో ఒక్కో […]

ఆ నిధులు కూడా మింగేశారు: ఎంపీ విజయసాయి ట్వీట్
Follow us on

రాజకీయ నేతలు ప్రత్యక్షంగా కంటే పరోక్షంగానే యుద్ధాలు చేసుకుంటున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అధికార విపక్షాల మధ్య ట్విట్టర్ వేదికగా ఇరుపార్టీల నేతలు సై అంటే సై అంటున్నారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడిపీ నేతల అవినీతిపై కామెంట్స్ చేశారు. తాజగా చేసిన ట్వీట్‌లో “పేద కుటుంబాలకు మరుగుదొడ్ల నిర్మాణం కోసం కేటాయించిన నిధులను టీడీపీ నేతలు మింగేశారంటూ ఆరోపించారు. పార్టీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన నివాసంతోపాటు, అప్పటి మంత్రుల ఇళ్లలో ఒక్కో టాయిలెట్ రెనోవేషన్ పనులకు 7 నుంచి 9 లక్షలు ఖర్చు చేసినట్టు బిల్లులు సృష్టించారని విమర్శించారు. మీ అవినీతితో చివరకు దొడ్లను సైతం విడిచిపెట్టలేదు కదా చంద్రబాబు గారూ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

టీడీపీ, వైసీపీ నేతల మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతూనే ఉంది. టీడీపీ నేతలు మరుగుదొడ్ల నిర్మాణం కోసం విడుదల చేసిన నిధులను పక్కదారి పట్టించారని ఆయన తన ట్వీట్‌లో ఆరోపించారు.