Telangana: జీలకర్ర బెల్లం తంతు కూడా ముగిసింది.. మరికొద్ది క్షణాల్లో 3 ముళ్లు.. కట్ చేస్తే కల్లాస్

|

Aug 10, 2022 | 3:58 PM

పెళ్లి మండపం కోలాహలంగా ఉంది. వచ్చిన అతిథులు, బంధుమిత్రులను పలకరించే పనిలో ఉన్నారు వధూవరులు కుటుంబ సభ్యులు. అంతలోనే ఊహించని సీన్...

Telangana: జీలకర్ర బెల్లం తంతు కూడా ముగిసింది.. మరికొద్ది క్షణాల్లో 3 ముళ్లు.. కట్ చేస్తే కల్లాస్
Groom Cheating
Follow us on

Trending News: జీలకర్ర బెల్లం తంతు కూడా ముగిసిపోయింది. అంటే ఆల్మోస్ట్ పెళ్లి అయిపోయినట్లే. మరి కొద్ది నిమిషాల్లో తాళి కట్టాలి. అంతా సజావుగా సాగిపోతే.. ఓ జంట ఒకటయ్యేది. కానీ.. ఓ మహిళ ఎంట్రీతో ఆ పెళ్లికి వచ్చిన అతిథులు కంగుతిన్నారు. ఆమె అరుపులు, కేకలతో అక్కడ గందరగోళం నెలకుంది. కట్ చేస్తే.. తాళి కట్టు శుభ వేళ.. ఆ పెళ్లి ఆగి పోయింది. ఇదాంతా ఓ సినిమా షూటింగ్‌ లెవల్‌లో సాగిపోయింది. మంగళవాయిద్యాలు మోగాల్సిన.. ఆ పెళ్లి పందిట్లో ఘర్షణ వాతావరం ఏర్పడింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా(mancherial district) కేంద్రంలోని భీమాగార్డెన్‌లో జరిగింది. ఫంక్షన్‌ హాల్లో జరుగుతున్న పెళ్లి మధ్యలోనే ఆగి పోయింది. ముందుగా.. ఒక అమ్మాయికి అన్యాయం చేయడమే కాకుండా.. మరో అమ్మాయిని పెళ్లి పేరుతో అన్యాయం చేయబోయిన కన్నింగ్‌గాన్ని చితక బాదారు. పెళ్లి కూతురు తరుపున వచ్చిన వారంతా పెళ్లి కొడుకు రాజేష్‌ చెంపలు చెల్లు మనిపించారు. కొన్నాళ్లు ప్రేమ పేరుతో టైమ్‌ పాస్‌ చేసిన యువకుడు మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు ముహూర్తం పెట్టుకున్నాడు. ఇవాళ భీమా గార్డెన్‌లో ఘనంగా పెళ్లి జరుగుతుంది.

ఈ విషయం తెలుసుకొని.. బాధితురాలు ఫంక్షన్‌ హాల్‌కు చేరుకుంది. బలవంతంగా పెళ్లిని ఆపేసింది. అయితే.. ఒంటరిగా వచ్చిన మహిళను పెళ్లి కుమారుడి బంధువులు చితక బాదారు. ఆ తర్వాత పెళ్లి కూతురి బంధువులు వరుడి తాట తీశారు. పెళ్లి పేరుతో మోసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తోంది బాధితురాలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..