గోధ్రా వంటి పరిస్థితి తలెత్తవచ్చు.. కర్నాటక మంత్రి సంచలన వ్యాఖ్య

| Edited By:

Dec 21, 2019 | 3:11 PM

సవరించిన పౌరసత్వ చట్టంపై ఓ వైపు దేశంలో నిరసనలు పెల్లుబుకుతుండగా.. మరోవైపు కర్నాటక మంత్రి సీ. టి. రవి వివాదాస్పద వ్యాఖ్య చేశారు. మెజారిటీ ప్రజల (హిందువుల) సహనాన్ని పరీక్షించవద్దని, ఒకప్పుడు గుజరాత్ లోని గోధ్రాలో ఏం జరిగిందో ఓ సారి గుర్తు తెచ్చుకోవాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేత యు.టి. ఖాదర్ ఇటీవల చేసిన ఓ వ్యాఖ్యకు కౌంటర్ గా రవి ఇలా తీవ్రంగా స్పందించారు. గోధ్రాలో కొంతమంది తమ మానసిక దౌర్బల్యంతో రైలుకు నిప్పు […]

గోధ్రా వంటి పరిస్థితి తలెత్తవచ్చు.. కర్నాటక మంత్రి సంచలన వ్యాఖ్య
Follow us on

సవరించిన పౌరసత్వ చట్టంపై ఓ వైపు దేశంలో నిరసనలు పెల్లుబుకుతుండగా.. మరోవైపు కర్నాటక మంత్రి సీ. టి. రవి వివాదాస్పద వ్యాఖ్య చేశారు. మెజారిటీ ప్రజల (హిందువుల) సహనాన్ని పరీక్షించవద్దని, ఒకప్పుడు గుజరాత్ లోని గోధ్రాలో ఏం జరిగిందో ఓ సారి గుర్తు తెచ్చుకోవాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేత యు.టి. ఖాదర్ ఇటీవల చేసిన ఓ వ్యాఖ్యకు కౌంటర్ గా రవి ఇలా తీవ్రంగా స్పందించారు. గోధ్రాలో కొంతమంది తమ మానసిక దౌర్బల్యంతో రైలుకు నిప్పు పెట్టి కరసేవకులను సజీవ దహనం చేశారని, అయితే ప్రతీకార విషయానికి వచ్ఛేసరికి ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు. ‘ ఆ ఘటనలో ప్రజలు ఎంతటి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారో.. మీరు మర్చిపోయి ఉండవచ్ఛు. దయచేసి దాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి ‘ అన్నారాయన. మంగుళూరులోని ప్రస్తుత పరిస్థితిని రవి గోధ్రా ఘటనతో పోలుస్తూ ఓ వీడియో ట్వీట్ చేశారు.
దీనిపై మండిపడిన కర్నాటక పీసీసీ మాజీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు.. ఆ మంత్రి (సీ.టి.రవి) బెదిరించే విధంగా మరీ రెచ్ఛగొట్టే వ్యాఖ్య చేశారని, పోలీసులు ఆయనపై వెంటనే కేసు నమోదు చేసి ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవిలో ఉన్న ఒక వ్యక్తి ఇలా విషం చిమ్మరాదని కోరారు.