పరామర్శకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న వైసీపీ నేతలు

ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన పలువురు వైసీసీ నేతలు గోదావరి మధ్యలో పంటు నిలిచిపోవడంతో చిక్కుకుపోయారు.

పరామర్శకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న వైసీపీ నేతలు
Follow us

|

Updated on: Aug 18, 2020 | 1:54 PM

ఐదు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో గోదావరి తీర ప్రాంతాలు నీట మునిగాయి. వందలాది మంది కుటుంబాలు నిరాశ్రులయ్యారు. కట్టుబట్టలతో సహాయం కోసం అర్థిస్తున్నారు. అయితే, ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన పలువురు వైసీసీ నేతలు గోదావరి మధ్యలో పంటు నిలిచిపోవడంతో చిక్కుకుపోయారు. కోటిపల్లి నుంచి ఆయినవిల్లి మండలంలో ముంపు గ్రామాలను పరిశీలించేందుకు పలువురు వైసీపీ నేతలు, మీడియా బృందంతో కలిసి పంటులో బయలుదేరారు. అయితే, కపిలేశ్వరపురం మండలం అద్దంకి వారిలంక…వీరవల్లి పాలెం మార్గమధ్యలో అకస్మాత్తుగా ఇంజిన్‌ చెడిపోయింది. దీంతో పంటు గోదావరి మధ్యలో నిలిచిపోయింది. బోటు ఎంతకూ స్టార్ట్ కాకపోవడంతో నేతలు బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. బోటులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, మరి కొందరు వైసీపీ నేతలు, మీడియా ప్రతినిధులు ఉన్నట్లు సమాచారం.

Latest Articles