మంగళవారం జరగనున్న జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించడానికి దేశవ్యాప్తంగా 3843 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాల సంఖ్యను 570 నుంచి 660కి పెంచారు. ఎగ్జామ్ హాల్లో భౌతిక దూరం పాటించడం కోసం ఎగ్జామ్ సెంటర్లను గణనీయంగా పెంచారు. మెయిన్ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 8.58 లక్షల మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుండి లక్షా 40వేల మంది విద్యార్థులు పరీక్షరాయనున్నారు. రెండు సెషన్లలో జేఈఈ మెయిన్స్ పరీక్ష జరగనుంది
మొదటి సెషన్ ఉదయం 9 గంటలనుండి 12 గంటల వరకు, రెండవ స్టేషన్ మధ్యాహ్నం మూడు గంటల నుండి 6 గంటల వరకు ఉంటుంది. జెఇఇ మెయిన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి ) అన్న విషయం తెలిసిందే. అభ్యర్థులు సామాజిక దూరం పాటించేలా పరీక్షా కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేశారు. కరోనా సింటమ్స్ ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. వీటిల్లోని ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లు ఇవ్వనున్నారు. స్టూడెంట్స్ పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే ముందు అందరికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు.
విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లాల్సిన వాటి వివరాలు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) వెల్లడించింది.
Also Read : ఆరు వారాల్లో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ !