ఇరాన్ లో ప్రజా ఉద్యమనేత జర్నలిస్ట్ రొహల్లా జామ్కు మరణశిక్ష విధించినట్టు ఆ దేశం మంగళవారం ప్రకటించింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో శిక్ష విధించినట్లు అక్కడి మీడియ తెలిపింది. 2017లో మతపరమైన షియా ఆర్థిక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపర్చటం ద్వారా రొహల్లా ఇరాన్లో భారీ ప్రజాందోళనకు స్ఫూర్తిదాతగా నిలిచారు. రుహోల్లా చేసిన నేరాన్ని దేశంలోని అత్యంత తీవ్రమైన నేరాలలో ఒకటిగా భావిస్తున్నట్లు న్యాయవ్యవస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఫ్రాన్స్లో తలదాచుకున్న రుహోల్లాను గతేడాది అరెస్టయ్యాడు.