ఐపీఎల్ 2021లో కొత్త టీమ్‌గా అహ్మదాబాద్! మరో రెండు జట్లకు కూడా అవకాశం.. డిసెంబర్ 24న తుది నిర్ణయం..

|

Dec 03, 2020 | 4:48 PM

ఐపీఎల్ 2021లో మరో రెండు కొత్త జట్ల ఎంట్రీపై వడివడిగా అడుగులు పడుతున్నాయి. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌‌ను భారత్ వేదికగా జరిపేందుకు బీసీసీఐ కసరత్తులు షురూ చేసింది.

ఐపీఎల్ 2021లో కొత్త టీమ్‌గా అహ్మదాబాద్! మరో రెండు జట్లకు కూడా అవకాశం.. డిసెంబర్ 24న తుది నిర్ణయం..
Follow us on

IPL 2021 New Team: ఐపీఎల్ 2021లో మరో రెండు కొత్త జట్ల ఎంట్రీపై వడివడిగా అడుగులు పడుతున్నాయి. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌‌ను భారత్ వేదికగా జరిపేందుకు బీసీసీఐ కసరత్తులు షురూ చేసింది. ఇందులో భాగంగానే ఈ నెల 24వ తేదీన బీసీసీఐ వార్షిక సమావేశం జరగనుంది. అందులో కొత్త జట్ల ప్రతిపాదనపై చర్చించి, ఆమోదముద్ర వేయడంతో పాటు టోర్నీ ఏర్పాటుపై కూడా కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

మరోవైపు వచ్చే సీజన్‌కు అహ్మదాబాద్ ఫ్రాంచైజీ దాదాపు ఖరారైనట్లు ప్రముఖ స్పోర్ట్స్ వెబ్‌సైట్ ఇన్‌సైడ్ స్పోర్ట్ తెలిపింది. అలాగే ఐపీఎల్ 2021 లేదా 2022 కోసం ఒకటి కంటే ఎక్కువ జట్లను పెంచాలని బీసీసీఐ ఏజీఎం నిర్ణయించినట్లయితే మరో టీమ్ లక్నో/కాన్పూర్ లేదా పూణే అవుతుందని తెలుస్తోంది.

దీనిపై డిసెంబర్ 24వ తేదీన బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంటుంది. కాగా, కొత్త టీమ్ కోసం అదానీ గ్రూప్, సియట్ కంపెనీలతో పాటు ఆర్‌పీఎస్‌జీ, నటుడు మోహన్‌ లాల్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇక ఐపీఎల్ 2021 కోసం  మెగా ఆక్షన్ జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఉంటుందని వినికిడి.