మ్యాక్స్‌వెల్.. ఎక్కడ నీ మ్యాడ్‌నెస్‌..!

|

Oct 09, 2020 | 6:32 PM

ఐపీఎల్ 2020లో ఇప్పటిదాకా ఆరు మ్యాచ్‌లు ఆడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓటములకు మ్యాక్స్‌వెల్ ఫామ్‌లో లేకపోవడం కూడా ఓ కారణమని చెప్పొచ్చు. ఇప్పుడు అతడి ఆటతీరుపై

మ్యాక్స్‌వెల్.. ఎక్కడ నీ మ్యాడ్‌నెస్‌..!
Follow us on

IPL 2020: ఐపీఎల్ 2020లో ఇప్పటిదాకా ఆరు మ్యాచ్‌లు ఆడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కేవలం ఒకదానిలోనే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఆ జట్టు ఓటములకు మ్యాక్స్‌వెల్ ఫామ్‌లో లేకపోవడం కూడా ఓ కారణమని చెప్పొచ్చు. ఇప్పుడు అతడి ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఒక వైపు సీనియర్లు.. మరో వైపు నెటిజన్లు మాక్సీపై విరుచుకుపడుతున్నారు. ఈ ఏడాది పంజాబ్ మ్యాక్స్‌వెల్‌ను రూ.10.75 కోట్ల భారీ రెమ్యునరేషన్ చెల్లించి మరీ సొంతం చేసుకుంది. అంతటి రెమ్యునరేషన్ అందుకుంటున్న మ్యాక్స్‌వెల్ ఆరు మ్యాచ్‌ల్లో కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌లకు మారుపేరు అయిన మ్యాక్స్‌వెల్‌లో అప్పటి ఆట కనిపించడం లేదు. వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. తనదైన రోజు వస్తే ఆట స్వరూపాన్ని పూర్తిగా మార్చే ”మ్యాడ్ మాక్సీ” కావాలని.. నీ మ్యాడ్‌నెస్‌ ఏమైందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: 

ఇంజినీరింగ్ విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

నిరుపేద కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే కొత్త రైళ్లు ఇవే..!