ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే అనేక సంస్కరణలు చేపడుతోంది. అందులో భాగంగా ఏప్రిల్ 1 నుంచి మరిన్ని మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో ఒకటి PNR Linking. ప్రయాణికులకు మేలు చేసేందుకు రైల్వే తీసుకున్న కొత్త నిర్ణయమిది. పీఎన్ఆర్ లింకింగ్ దూరప్రయాణం చేసే రైల్వే ప్రయాణికులకు ఉపయోగపడుతుంది.
దూర ప్రయాణీకులు లాంగ్ టూర్ ప్లాన్ చేసుకొన్నప్పుడు ఒకేసారి రెండుమూడు రైళ్లు కనెక్ట్ అయ్యేలా టికెట్ బుక్ చేసుకొని ఉంటారు. గమ్యస్థానానికి నేరుగా ట్రైన్ లేకపోతే చాలామంది ఇలా కనెక్టింగ్ రైళ్లను బుక్ చేసుకోవడం మామూలే. అలాంటి సందర్భాల్లో మొదటి రైలు ఆలస్యంగా రావడం వల్ల రెండో రైలు మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువ. దీని వల్ల ఇన్నాళ్లూ ప్రయాణికులు తీవ్రంగా నష్టపోయేవాళ్లు. ప్రయాణికులు అలా నష్టపోకుండా రైల్వే తీసుకున్న నిర్ణయమే ‘పీఎన్ఆర్ లింకింగ్’. అంటే మీరు బుక్ చేసుకున్న ప్రతీ టికెట్కు వేర్వేరు పీఎన్ఆర్ నెంబర్లు ఉంటాయి. వాటిని అనుసంధానించడమే ‘పీఎన్ఆర్ లింకింగ్’. దీని ద్వారా మీ రెండో రైలు మిస్ అయితే రీఫండ్ పొందడం సులువు. 2019 ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.
రీఫండ్ రూల్స్…