దేశంలో క‌రోనా వీర‌విహారం… కొత్తగా 29,429 కేసులు, 582 మరణాలు

|

Jul 15, 2020 | 10:01 AM

భారత్​లో కరోనా వ్యాప్తి తీవ్ర‌త‌రం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 29,429 కరోనా కేసులు నమోదయ్యాయి.

దేశంలో క‌రోనా వీర‌విహారం... కొత్తగా 29,429 కేసులు, 582 మరణాలు
Follow us on

భారత్​లో కరోనా వ్యాప్తి తీవ్ర‌త‌రం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 29,429 కరోనా కేసులు నమోదయ్యాయి. 582 మంది కోవిడ్-19 కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ప్ర‌స్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య‌ 9,36,181కి చేరుకుంది. ప్ర‌జంట్ 3,19,840 యాక్టివ్ కేసులున్నాయి. 5,92,032 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. క‌రోనాతో మొత్తం మ‌ర‌ణించిన వారి సంఖ్య‌ 24,309.

ఇక‌ మహారాష్ట్రలో కరోనా​ వైర‌స్ చెల‌రేగిపోతుంది. అక్క‌డ‌ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,67,665కి చేరింది. 10,695 మంది వైరస్ కార‌ణంగా చ‌నిపోయారు. తమిళనాడులో మొత్తం కేసులు 1,47,324కి చేరాయి. 2,099 మంది వైర‌స్ కు బ‌ల‌య్యారు. ఢిల్లీలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య‌ 1,15,346గా ఉంది. మొత్తంగా 3,446 మంది క‌రోనా కార‌ణంగా మృతి చెందారు. గుజరాత్​లో మొత్తంగా 43,637 మందికి క‌రోనా సోక‌గా… 2,069 మంది చనిపోయారు.