తాను రిటైర్మెంట్ ప్రకటించడం లేదని, జట్టులోనే కొనసాగుతున్నానని వెస్టిండీస్ దిగ్గజ ఒపెనర్ క్రిస్ గేల్ అన్నాడు. భారత్లో వన్డే సిరీస్ అనంతరం గేల్ క్రికెట్కు వీడ్కోలు పలుకుతాడని వచ్చిన వార్తలపై అతడు స్పందించాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా టీమిండియాతో జరిగిన ఆఖరి వన్డేలో గేల్ తనదైన రీతిలో చెలరేగి ఆడాడు. సిక్సర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 41 బంతుల్లో 72 పరుగులు సాధించి ఖలీల్ బౌలింగ్లో వెనుదిరిగాడు. అయితే గేల్ ఔటైన తర్వాత భారత ఆటగాళ్లంతా అతడిని అభినందించడం, మైదానాన్ని వీడుతూ అతడు హెల్మెట్లో బ్యాట్ను పెట్టి పైకెత్తి అభిమానులకు అభివాదం చేయడంతో గేల్కు ఇదే ఆఖరి మ్యాచ్ అని అంతా భావించారు. కాని మ్యాచ్ ముగిసిన అనంతరం గేల్ తన రిటైర్మెంట్ పై మాట్లాడుతూ.. రిటైర్మెంట్ గురించి తాను ఎలాంటి ప్రకటన చేయలేదని చెప్పాడు.