కేంద్ర ఐజీఎస్టీ కమిటీలో మంత్రి హరీశ్‌రావుకు చోటు

|

Jul 22, 2020 | 9:17 PM

ఐజీఎస్టీ పరిష్కారంపై నియమించిన మంత్రుల బృందంలో జీఎస్టీ మండలి మార్పులు చేసింది. ఏడుగురితో కొత్త కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. ఈ కొత్త కమిటీలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు చోటు కల్పించింది.

కేంద్ర ఐజీఎస్టీ కమిటీలో మంత్రి హరీశ్‌రావుకు చోటు
Follow us on

ఐజీఎస్టీ పరిష్కారంపై నియమించిన మంత్రుల బృందంలో జీఎస్టీ మండలి మార్పులు చేసింది. ఏడుగురితో కొత్త కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. ఈ కొత్త కమిటీలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు చోటు కల్పించింది. ఈ కమిటీకి కన్వీనర్‌గా బిహార్‌ ఆర్థికమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ నియమితులయ్యారు. ఐజీఎస్టీ పరిష్కారం, సంబంధిత అంశాలపై 2019 డిసెంబర్‌లో ఈ కమిటీ ఏర్పాటైంది. గతంలో కేంద్ర, రాష్ట్రాల పన్ను అధికారులు, వాణిజ్య, పారిశ్రామిక రంగాల ప్రతినిధులు, జీఎస్‌టీ ఇతర భాగస్వాములకు కమిటీలో స్థానం కల్పించేవారు. తాజాగా కొన్ని మార్పులు చేస్తూ కేంద్ర జీఎస్టీటీ కార్యాలయం మెమోరాండం విడుదల చేసింది.