రెండు కార్లు ఢీ.. ఐదుగురు మృతి, మరో నలుగురు సీరియస్

గుజరాత్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

రెండు కార్లు ఢీ.. ఐదుగురు మృతి, మరో నలుగురు సీరియస్

Updated on: Aug 17, 2020 | 3:26 PM

గుజరాత్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఖేడా జిల్లాలోని నాడియా వద్ద అహ్మదాబాద్-వడోదర ఎనిమిదో నెంబరు జాతీయ రహదారిపై ఈ సోమవారం తెల్లవారు జామున ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టాయి. దీంతో రెండు వాహానాల్లో వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే ఐదుగురు మృతిచెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం నాడియా సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించినట్టు పోలీసులు తెలిపారు.బాధితులంతా అహ్మదాబాద్ నగరానికి చెందినవారిగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతివేగంతోపాటు నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు పోలీసులు.

Follow Us