Visakhapatnam Quarantine Center: విశాఖపట్నంలోని కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా కొమ్మాది శ్రీ చైతన్య క్యాంపస్ లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలోని కంప్యూటర్ ల్యాబ్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలు ఆర్పివేశారు.
Also Read: బాలకృష్ణ గొప్ప మనసు.. కోవిడ్ ఆసుపత్రికి భారీ విరాళం..
ఆ క్వారంటైన్ కేంద్రంలో 64 మంది రోగులు ఉండగా.. వారెవరికీ కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనితో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఇటీవల విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ కరోనా కేర్ సెంటర్ ఘటనలో పలువురు కరోనా రోగులు మృతి చెందిన సంగతి తెలిసిందే.
Also Read: ఢిల్లీ టూ లండన్.. బస్సులో అడ్వెంచర్ జర్నీ..