ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే..

|

Sep 21, 2020 | 11:54 PM

కోవిడ్ వైరస్ వ్యాప్తి‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో విద్యా వ్యవస్థతోపాటు అనేక ప్రవేశ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. అయితే లాక్‌డౌన్‌ సడలింపులతో తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ ఖరారైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 28, 29 తేదిల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ మేర‌కు తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి సోమవారం ఒక ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ఆన్‌లైన్‌ ద్వారా జేఎన్టీయూ(JNTU) ఈ […]

ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే..
Follow us on

కోవిడ్ వైరస్ వ్యాప్తి‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో విద్యా వ్యవస్థతోపాటు అనేక ప్రవేశ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. అయితే లాక్‌డౌన్‌ సడలింపులతో తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ ఖరారైన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో సెప్టెంబర్‌ 28, 29 తేదిల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ మేర‌కు తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి సోమవారం ఒక ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ఆన్‌లైన్‌ ద్వారా జేఎన్టీయూ(JNTU) ఈ పరీక్ష నిర్వహించనుంది.

మొత్తం 84 పరీక్ష కేంద్రాల్లో 67 తెలంగాణ, 17 ఏపీ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 7,970 మంది పరీక్షకు హాజరు కానున్నారు. రెండు రోజులపాటు రెండు సెషన్స్‌లో పరీక్షలు జరగనున్నాయి. ఈ రోజు నుంచి ఆ నెల 25 వరకు వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్స్‌ అందుబాటులో ఉంటాయని పేర్కొంది.