ఏపీలో 8 లక్షలు దాటిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే.!

|

Oct 23, 2020 | 7:04 PM

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,765 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,00,684కి చేరింది.

ఏపీలో 8 లక్షలు దాటిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే.!
Follow us on

Coronavirus Positive Cases AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,765 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,00,684కి చేరింది. ఇందులో 31,721 యాక్టివ్ కేసులు ఉండగా.. 7,62,419 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 20 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,544కు చేరుకుంది. ఇక నిన్న 4,281 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 152, చిత్తూరు 347, తూర్పుగోదావరి 475, గుంటూరు 523, కడప 225, కృష్ణా 460, కర్నూలు 69, నెల్లూరు 122, ప్రకాశం 317, శ్రీకాకుళం 199, విశాఖపట్నం 218, విజయనగరం 126, పశ్చిమ గోదావరి 532 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,12,661కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 756 మంది కరోనాతో మరణించారు.