నాలుగు కిలోలు తగ్గిన చిదంబరం… కారణం ఎంటో తెలుసా..?

ఐఎన్ఎక్స్ కేసులో నిందితుడుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ. చిదంబరం (74) బరువు తగ్గుతున్నారు. గత నెలరోజులుగా ఆయన 4కిలోలు బరువు తగ్గారు. దానికి కారణం ప్రస్తుతం ఆయన తినే ఆహారమే. ప్రస్తుతం జ్యూడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఆయనకు రోజు జైలులో పెట్టే ఆహారం పడటం లేదు. అయితే తొలుత ఆహార విషయానికి సంబంధించి తనకు వెసులుబాటు కల్పించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. కోర్టు ఆయన అభ్యర్థనను సున్నితంగా […]

నాలుగు కిలోలు తగ్గిన చిదంబరం... కారణం ఎంటో తెలుసా..?
Follow us

| Edited By:

Updated on: Oct 05, 2019 | 5:41 PM

ఐఎన్ఎక్స్ కేసులో నిందితుడుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ. చిదంబరం (74) బరువు తగ్గుతున్నారు. గత నెలరోజులుగా ఆయన 4కిలోలు బరువు తగ్గారు. దానికి కారణం ప్రస్తుతం ఆయన తినే ఆహారమే. ప్రస్తుతం జ్యూడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఆయనకు రోజు జైలులో పెట్టే ఆహారం పడటం లేదు. అయితే తొలుత ఆహార విషయానికి సంబంధించి తనకు వెసులుబాటు కల్పించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. కోర్టు ఆయన అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించింది. అయితే ఈ నేపథ్యంలో ఆయన జైలు ఆహారం పడకపోవడంతో అనారోగ్యానికి గురై.. నాలుగు కిలోల మేరా బరువు తగ్గారు. ఈ విషయంపై చిదంబరం తరఫు న్యాయవాది.. ఆహారం విషయంలో ఇంటినుంచి తెచ్చుకునేందకు వెసులుబాటు కల్పించాలని  గురువారం సీబీఐ కోర్టును మరోసారి అభ్యర్థించారు. న్యాయవాది అభ్యర్థనను ఈ సారి కోర్ట్ అంగీకరించింది. ఇంటి నుంచి తెచ్చిన భోజ‌నాన్ని తినేందుకు ప‌ర్మిష‌న్ ఇచ్చింది. అంతేకాదు ఇక వైద్య స‌దుపాయం కోసం బ‌య‌ట ఆస్ప‌త్రుల‌కు వెళ్లేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది.

కాగా, బెయిల్ ఇవ్వాలంటూ గురువారం చిదంబ‌రం సుప్రీంను ఆశ్ర‌యించారు. ఆయన త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్ కోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేశారు. ఈ నేపథ్యంలో బెయిల్‌ పిటిషన్‌పై అభిప్రాయాన్ని చెప్పాలంటూ శుక్రవారం సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ చిదంబరం తొలుత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఆర్‌ బానుమతి, జస్టిస్‌ రిషికేశ్‌ రాయ్‌ విచారణ జరిపారు.