వారికి ఫుల్ రీఫండ్ లేదా ఫ్రీ టికెట్: కేంద్రం

కరోనా లాక్‌డౌన్ సమయంలో విమాన టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణీకులకు విమానయాన సంస్థలు ఫుల్ రీ-ఫండ్ ఇవ్వాలని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్(డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసింది.

వారికి ఫుల్ రీఫండ్ లేదా ఫ్రీ టికెట్: కేంద్రం

Updated on: Sep 08, 2020 | 9:18 AM

కరోనా లాక్‌డౌన్ సమయంలో విమాన టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణీకులకు విమానయాన సంస్థలు ఫుల్ రీ-ఫండ్ ఇవ్వాలని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్(డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఇదే విషయాన్ని సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడివేట్‌లో కూడా తెలిపింది. (Full Refund To Air Tickets Booked Before Lockdown)

ఒకవేళ విమాన సంస్థలు ఆర్ధికంగా కష్టాల్లో ఉన్నట్లయితే.. ప్రయాణీకులకు క్రెడిట్ షల్ సదుపాయాన్ని కల్పించాలని కేంద్రం తెలిపింది. దాని ద్వారా ఆ డబ్బు మొత్తాన్ని 2021 మార్చి 31 వరకు ఏ రూట్‌లోనైనా ప్రయాణించేందుకు ప్రయాణీకులు వినియోగించుకోవచ్చంది. అంతేకాకుండా ఆ క్రెడిట్ షల్ ప్రయాణీకులకు సౌలభ్యంగా ఉండాలని కేంద్రం తెలిపింది. క్రెడిట్ షెల్‌లోని డబ్బును ప్రయాణీకుడు మరొకరి అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోగలిగే అవకాశం ఉండాలంది. ఇక మార్చి 25వ తేదీ కంటే ముందు బుక్ చేసుకున్న టికెట్లకు 15 రోజుల్లోపు ఫుల్ రీఫండ్ వస్తుంది. కాగా, మార్చి 25 నుంచి మే 3 మధ్యలో దేశీయ, విదేశీ టికెట్లు బుక్ చేసుకున్నవారికి డబ్బులు ఫుల్ రీ ఫండ్ రానున్నాయి.

Also Read: సెప్టెంబర్ 12 నుంచి తెలుగు రాష్ట్రాల్లో నడిచే స్పెషల్ ట్రైన్స్ ఇవే..

 

Loading...
Unable to load recommendations.
Follow Us