సీబీఐని తికమక పెట్టిన రియా పొరుగింటావిడ

| Edited By: Pardhasaradhi Peri

Oct 11, 2020 | 8:09 PM

సుశాంత్ కమ్ డ్రగ్స్ కేసులో ఈ మధ్యే బెయిల్ పై విడుదలైన రియా చక్రవర్తి ఇంటి పక్కనే ఉన్నానని చెప్పుకున్న ఓ మహిళ. సీబీఐని  తికమక పెట్టింది. డింపుల్ థావనీ అనే ఈమె తాను గత జూన్ 13 న రియా, సుశాంత్ లను చూశానని సీబీఐ అధికారులకు తెలిపింది. అయితే వారు గుచ్చి గుచ్చి ప్రశ్నించడంతో, తాను వారిని చూడలేదని, ఎవరో చెబితే విన్నానని చెప్పింది. అంతేకాదు.. వాళ్లిద్దరూ వెళ్తుంటే ఎవరో చూసి తనకు ఈ […]

సీబీఐని తికమక పెట్టిన రియా పొరుగింటావిడ
Follow us on

సుశాంత్ కమ్ డ్రగ్స్ కేసులో ఈ మధ్యే బెయిల్ పై విడుదలైన రియా చక్రవర్తి ఇంటి పక్కనే ఉన్నానని చెప్పుకున్న ఓ మహిళ. సీబీఐని  తికమక పెట్టింది. డింపుల్ థావనీ అనే ఈమె తాను గత జూన్ 13 న రియా, సుశాంత్ లను చూశానని సీబీఐ అధికారులకు తెలిపింది. అయితే వారు గుచ్చి గుచ్చి ప్రశ్నించడంతో, తాను వారిని చూడలేదని, ఎవరో చెబితే విన్నానని చెప్పింది. అంతేకాదు.. వాళ్లిద్దరూ వెళ్తుంటే ఎవరో చూసి తనకు ఈ విషయం చెప్పారని కూడా ఆమె తెలిపింది. ఆమె స్టేట్ మెంట్ ని రికార్డు చేసిన సీబీఐ, అబద్దాలు చెప్పవద్దని, ఎవరో చెప్పినదాన్ని నిజమో కాదో నిర్ధారించుకోకుండా వాగవద్దని గట్టి అల్టిమేటం ఇచ్చారు. ఇదెక్కడి మేళం అని నిట్టూర్చారు.