బీజేపీ కార్యకర్తలతో వెళ్తున్న బస్సు బోల్తా.. ఏడుగురికి గాయాలు

| Edited By:

May 16, 2019 | 1:38 PM

హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూ జిల్లాలో బీజేపీ కార్యకర్తలతో వెళ్తోన్న బస్సు ప్రమాదానికి గురైంది. నాగ్ని గ్రామ సమీపంలో ఇవాళ ఉదయం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 45మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.

బీజేపీ కార్యకర్తలతో వెళ్తున్న బస్సు బోల్తా.. ఏడుగురికి గాయాలు
Follow us on

హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూ జిల్లాలో బీజేపీ కార్యకర్తలతో వెళ్తోన్న బస్సు ప్రమాదానికి గురైంది. నాగ్ని గ్రామ సమీపంలో ఇవాళ ఉదయం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 45మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.