పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డులోకి తొలి సారి ఓ మహిళ

పాక్​ బోర్డులోని డైరెక్టర్లలో తొలిసారి ఓ మహిళకు అవకాశం కల్పించారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పీసీబీ ఛైర్మన్ ఎహ్సాన్ మణి ఆనందం వ్యక్తం చేశారు. పాక్ ​ క్రికెట్​ బోర్డు డైరెక్టర్​గా తొలిసారి ఓ మహిళా నియామకమైంది.

పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డులోకి తొలి సారి ఓ మహిళ

Updated on: Nov 11, 2020 | 2:46 AM

పాక్​ బోర్డులోని డైరెక్టర్లలో తొలిసారి ఓ మహిళకు అవకాశం కల్పించారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పీసీబీ ఛైర్మన్ ఎహ్సాన్ మణి ఆనందం వ్యక్తం చేశారు. పాక్ ​ క్రికెట్​ బోర్డు డైరెక్టర్​గా తొలిసారి ఓ మహిళా నియామకమైంది. కొత్తగా ఏర్పాటైన నలుగురు పీసీబీ డైరెక్టర్లలో హ్యూమన్​ రిసోర్స్​ ఎగ్జిక్యూటివ్​గా అలియా జాఫర్​ను బోర్డు ఎంపిక చేసింది.

మిగిలిన వారిలో ఫైనాన్స్​ ఎగ్జిక్యూటివ్​ జావేద్​ కురేషీ, ఆర్థికవేత్త అసిమ్​ వాజిద్​ జావాద్​, కార్పొరేట్​ ఎగ్జిక్యూటివ్​ ఆరిఫ్​ సయీద్​లు ఉన్నారు. ఇందులో జాఫర్​, జావాద్​ల పదవీకాలం రెండేళ్లు.

నియామకాన్ని స్వాగతిస్తున్నాను పీసీబీ కొత్త రాజ్యాంగం ప్రకారం నలుగురు స్వతంత్ర డైరెక్టర్లలో కనీసం ఓ మహిళను తన గవర్నింగ్​ బోర్డులో నియమించడం తప్పనిసరి. కొత్తగా నియమించిన స్వతంత్ర డైరెక్టర్లలో మహిళా సభ్యురాలు ఎంఎస్​ అలియా జాఫర్​ ఎంపికను స్వాగతిస్తున్నట్లు పీసీబీ ఛైర్మన్​ ఎహ్సాన్​ మణి తెలిపారు.